logo

‘స్ప్రింగ్‌ స్ప్రీ’కి 8 వేల మంది..

ఏప్రిల్‌ 7 నుంచి మూడు రోజుల పాటు కళాధ్వని థీమ్‌తో ‘స్ప్రింగ్‌ స్రీˆ్ప’ వేడుకలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్వీ.రమణారావు పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 04:44 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య రమణారావు

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే : ఏప్రిల్‌ 7 నుంచి మూడు రోజుల పాటు కళాధ్వని థీమ్‌తో ‘స్ప్రింగ్‌ స్రీˆ్ప’ వేడుకలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్వీ.రమణారావు పేర్కొన్నారు. నిట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ విద్యా సంస్థల నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు వేడుకలకు హాజరవుతారని తెలిపారు. ప్రారంభోత్సవానికి సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథిగా వస్తున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు 55 ఈవెంట్లు, ప్రోషోలు జరుగుతాయన్నారు. స్టూడెంట్ వెల్ఫేర్‌ డీన్‌ ఆచార్య రవికుమార్‌, ఫ్యాకల్టీ అడ్వైజర్‌ ఆచార్య హీరాలాల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ సమన్వయకర్తలు వంశీకిషోర్‌, అజయ్‌ కుమార్‌, పీయాష్‌ కుమార్‌, సాయి గురునాథ్‌, ఆచార్య ఆనంద్‌ కిషోర్‌ కోలా, పవన్‌ కల్యాణ్‌ ఈవెంట్ మేనేజర్‌ డాక్టర్‌ నరేందర్‌ నాయక్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని