విదేశీ విద్యకు సహకారం
ఒకప్పుడు సంపన్నులు, ఉన్నత వర్గాలకు చెందిన వారే విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేవారు.. ప్రస్తుతం డీసీసీ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి రైతు బిడ్డలు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
రైతు బిడ్డలకు అండగా బ్యాంకు రుణాలు
స్టేషన్ఘన్పూర్ డీసీసీ బ్యాంకు
న్యూస్టుడే, స్టేషన్ఘన్పూర్ : ఒకప్పుడు సంపన్నులు, ఉన్నత వర్గాలకు చెందిన వారే విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేవారు.. ప్రస్తుతం డీసీసీ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి రైతు బిడ్డలు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. విదేశాల్లో చదవడానికి ఆసక్తి చూపించే గ్రామీణ రైతు బిడ్డలకు రుణాలు ఇచ్చేందుకు డీసీసీ బ్యాంకు ముందుకొచ్చింది. పాస్ పుస్తకాలతో భూములను మార్టిగేజ్ చేసుకొని రైతులకు రూ.లక్షల్లో రుణాలిచ్చి విదేశీ విద్యను ప్రోత్సహిస్తోంది. బ్యాంకు పరిధిలో ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాలకు చెందిన రైతులకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది రుణాలు పొంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.. 2021-22 మధ్య కాలంలో ఏడుగురు విద్యార్థులు రూ.1.20 కోట్ల రుణం పొంది అమెరికాకు వెళ్లారు. 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 11 మంది విద్యార్థులు రుణాలు పొందారు. వీరిలో ఐదుగురు అమెరికాకు వెళ్లారు.
రుణాలు పొందడం ఇలా..
డీసీసీ బ్యాంకు ద్వారా విద్యా రుణాలు పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు లేదా నాన్నమ్మ, తాతయ్య మరెవరైనా వారి పట్టా పుస్తకాలను మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అభ్యర్థులకు రుణాలను అందిస్తున్నారు. పట్టా భూమికి 13 ఏళ్లకు సంబంధించి అనుబంధ పత్రాలు(లింక్ డాక్యుమెంట్స్)ను అందిస్తే సరిపోతుంది.
బ్యాంకు సిబిల్ స్కోర్ 680 ఉండాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత యూనివర్సిటీ చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు, ల్యాప్టాప్, పుస్తకాలు, హాస్టల్ ఫీజు, ప్రాజెక్టు వర్క్, కొనుగోలు తదితర ఖర్చుల మొత్తానికి సంబంధించి గరిష్ఠంగా బ్యాంకు రూ.30 లక్షల వరకు రుణం అందిస్తోంది. రుణం పొందిన విద్యార్థి, అతడి తల్లిదండ్రులు మొదటి మూడేళ్ల వరకు కేవలం రుణంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. నాలుగో ఏడాది నుంచి వడ్డీతో పాటు అసలును వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
-మహబూబీ, డీసీసీ బ్యాంకు మేనేజర్, స్టేషన్ఘన్పూర్
బ్యాంకు నిబంధనల మేరకు విదేశీ చదువుల కోసం రుణాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో రైతుల పిల్లలకే రుణాలు ఇచ్చాం.. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రుణం వెంటనే వచ్చింది..
-మెడిచర్ల మణికంఠ(ఎమ్మెస్ అమెరికా), మల్కాపూర్, చిల్పూర్
సరైన పత్రాలతో రుణం దరఖాస్తు చేసుకున్న వెంటనే బ్యాంకు అధికారులు రూ.20 లక్షల రుణం మంజూరు చేశారు. ఎలాంటి కమీషన్, వాటాలు తీసుకోకుండానే డీసీసీ బ్యాంకులో రుణం మంజూరు చేశారు.
ఇబ్బందులు లేకుండా..
- గడ్డం యశ్వంత్(ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, లండన్) జఫర్గఢ్ మండలం, కూనూర్
దరఖాస్తు సమర్పించిన వెంటనే పత్రాలను పరిశీలించిన అధికారులు బ్యాంకు ఖాతాలో రూ.18 లక్షల నగదు జమ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?