మరోసారి సత్తా చాటిన మరియపురం
గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామమైన మరియపురం మరోసారి తన సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులకు ఎంపికైంది.
రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు
గీసుకొండ, న్యూస్టుడే: గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామమైన మరియపురం మరోసారి తన సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులకు ఎంపికైంది. గతేడాది ఈ గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎంపికవగా ఈ ఏడాది రాష్ట్రంలో ఉత్తమ గ్రామంగా ఎంపికవడం గమనార్హం. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్టేట్ వికాస్ పురస్కార్, నేషనల్ పంచాయతీ అవార్డులను 2021-22 సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. 9 అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకుగాను రాష్ట్రంలో మొత్తం 27 గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామాలుగా ఎంపిక చేసి ప్రకటించింది. జిల్లాలో అన్ని అంశాలకు పోటీ పడి మరియపురం తొమ్మిది అంశాల్లో నూరుశాతం ఫలితాలను సాధించగా, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యకరమైన పంచాయతీ అనే అంశంపై ప్రథమ స్థానానికి ఎంపికైంది. కాలుష్యరహిత గ్రామంగా కార్బన్ నేచురల్ విశేష్ పంచాయతీ పురస్కారం (సీఎన్వీపీపీ) కింద మరో ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో సోలార్ దీపాల ఏర్పాటు, పచ్చదనం పెంచడంలో ముందంజలో నిలిచింది.
జాతీయ స్థాయిలోనూ అవార్డు వస్తుంది
- అల్లం బాలిరెడ్డి, మరియపురం సర్పంచి
రాష్ట్రస్థాయిలో మా గ్రామానికి రెండు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు తనకు పూర్తి స్థాయిలో సహకరించడంవల్లే ఇది సాధ్యమైంది. తన పదవీకాలం పూర్తయ్యేలోగా గ్రామం మొత్తం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఎవరికి కావాల్సిన విద్యుత్తును వారే సొంతంగా తయారు చేసుకునేలా కృషి చేస్తా. మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని అనుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.