యువికా.. సృజన వేదిక
అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారి ఆలోచనలకు మెరుగులుదిద్దితే.. భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు.
విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు
భూపాలపల్లి, దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్టుడే : అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారి ఆలోచనలకు మెరుగులుదిద్దితే.. భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్రో(అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్ కలాం స్ఫూర్తితో యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా) రూపొందించింది. అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగాలు, పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కార్యక్రమం ఇలా.. : ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో బస, భోజనంతో పాటు రవాణా ఛార్జీలు అందజేస్తారు. మే 15 నుంచి 26వ తేదీ వరకు శిక్షణ ఉంటుంది. ఎంపికైన విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం, శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చా వేదికలు, ప్రయోగాల సందర్శన, సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
నాలుగు దశల్లో : ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు విధానం నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. www.isro.gov.in వెబ్సైట్లో యువికా అప్లికేషన్ ఎంచుకుని, ఈ-మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. నమోదు చేసిన 48 గంటల్లో ఇస్రో ఏర్పాటు చేసే ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. తర్వాత విద్యార్థి పూర్తి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. 8వ తరగతిలో 60 శాతం మార్కుల ప్రతిభ చూపి ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 15 శాతం ప్రతిభ చూపాలి. జిల్లా స్థాయి వ్యాసరచన, ఉపన్యాస, క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 20న అర్హుల జాబితా ప్రకటిస్తారు. ఎన్సీసీ, స్కౌట్లో సభ్యత్వం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని భూపాలపల్లి జిల్లా సైన్స్ అధికారి బి.స్వామి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో