రైతుకు నష్టం.. వ్యాపారికి లాభం
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీ మిర్చి బస్తాల బరువుకు సంబంధించి జారీచేసిన కొత్త మార్గదర్శకాలు రైతన్నకు నష్టం చేకూరుస్తుండగా, వ్యాపారులకు వరంగా మారనున్నాయి
న్యూస్టుడే, ఎనుమాముల మార్కెట్
బస్తా బరువు తగ్గించి తీసుకురావాలని రైతుకు కరపత్రం అందజేస్తున్న ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీ మిర్చి బస్తాల బరువుకు సంబంధించి జారీచేసిన కొత్త మార్గదర్శకాలు రైతన్నకు నష్టం చేకూరుస్తుండగా, వ్యాపారులకు వరంగా మారనున్నాయి. గతంలో ఒక్కో బస్తా 55 కిలోల వరకు ఉండేది. ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి మిర్చి బస్తాలను 25 కిలోలకు తగ్గకుండా, 49 కిలోలకు మించకుండా తీసుకురావాలని మార్కెట్ కమిటీ ఆదేశించింది. ఈ నిబంధనల వల్ల మిర్చి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తరుగు పేరుతో వ్యాపారులు విధిస్తున్న కోత వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. మిర్చి సీజన్లో ప్రతి రోజు సుమారు 50 వేల మిర్చి బస్తాలు మార్కెట్కు వస్తాయి. ఇప్పటివరకు ఒక్కో బస్తా 55 కిలోల బరువు ఉండేది. ఇప్పుడు 49 కిలోల పరిమితి విధించడం వల్ల అదనంగా 6వేల బస్తాలు తీసుకురావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై కిలో తరుగు తీసేస్తున్నారు. తేజ మిర్చి ధర క్వింటా (సుమారు రెండు బస్తాలు) సరాసరి రూ.23వేలు ఉంటే బస్తాకు రూ.115 లెక్కన తరుగు తీస్తున్నారు.. ఈలెక్కన 50వేల బస్తాలపై సుమారు రూ.57.5 లక్షలు తరుగు కింద వసూలు చేస్తున్నారు. కొత్తగా విధించిన 49 కిలోల నిబంధనల ప్రకారం అదనంగా 6122 బస్తాలు రైతులు తీసుకురావాల్సి ఉంది. ఆ మేరకు వ్యాపారులు అదనంగా రూ.6.90 లక్షలు వసూలు చేయనున్నారు. మరోవైపు ఈ నిబంధన వల్ల రైతులు అదనంగా బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కో బస్తా రూ.60 లెక్కన అదనంగా 6వేల బస్తాలపై 3.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో బస్తాకు వ్యాపారులు ఇచ్చేది మాత్రం రూ.30 మాత్రమే. అదీ ఎటువంటి చిల్లులు లేకుండా నాణ్యతగా ఉంటేనే. 6వేల బస్తాలపై రైతులకు కేవలం రూ.1.8 లక్షలు మాత్రమే తిరిగి వస్తోంది. అంటే అదనంగా కొన్న బస్తాలపైనా రూ.1.8 లక్షల మేర నష్టపోతున్నారు.
పట్టించుకోని పాలకవర్గం..
రైతుల పక్షాన నిలవాల్సిన పాలకవర్గం ఏ సందర్భంలోనూ.. గొంతువిప్పి వారి తరపున మాట్లాడింది లేదు. కేవలం మార్కెట్ నిధులతో అధ్యయనం పేరిట విహార యాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు 5వేలకు పైగా మిర్చి బస్తాలు తడిసిపోగా.. వ్యాపారులు తరుగు తీస్తున్నారని రైతన్నలు రోడ్డుకెక్కి వాహనాలు అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు నడిరోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా.. మార్కెట్ పాలకవర్గ సభ్యుడు ఒక్కరు కూడా రైతులకు న్యాయం చేసేందుకు ముందుకురాకపోవడం గమనార్హం. ప్రస్తుతం రైతులకు నష్టం చేసే మిర్చి బస్తాల బరువు విషయంలోనూ పాలకవర్గ సభ్యులు నోరుమెదపక పోవడం, రైతుల తరఫున నిలవకపోవడం పాలకవర్గం పనితీరుకు అద్దం పడుతోంది.
నిర్ణయం సరైనది కాదు..
సోమిశెట్టి భూమయ్య, స్తంభంపల్లి గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా
బస్తాల బరువును నిర్ణయించడం సరైనది కాదు. శ్రమకోర్చి పంట పండించిన తర్వాత కూలీలతో బస్తాలు నింపిస్తాం. ఆ బస్తాలనే మార్కెట్కు తీసుకొస్తాం. బస్తాల బరువును తూకం వేయడానికి మా వద్ద కాంటాలు ఉండవు. 49 కిలోల నిబంధనల వల్ల 50 క్వింటాళ్లు పండించిన రైతు సగటున రూ.8500 మేర నష్టపోతున్నారు. రైతులకు న్యాయం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం