logo

తేనెటీగల దాడిలో రైతు మృతి

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో రైతు పొన్‌రెడ్డి సంజీవ(50) మృతి చెందారు.

Published : 31 Mar 2023 15:51 IST


కొత్తగూడ: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో రైతు పొన్‌రెడ్డి సంజీవ(50) మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ ఆయన సోదరుడు జనార్ధన్‌రెడ్డి వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో పరుగు పెట్టారు. సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా సంజీవకు ఈత రాకపోవడంతో బావిలో మునిగిపోయి మృతి చెందాడు. జనార్ధన్‌రెడ్డికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నగేశ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని