పాఠశాలల సమస్త సమాచారం.. ట్యాబ్లో నిక్షిప్తం
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వం ‘ట్యాబ్’లను పంపిణీ చేస్తూ, అందులోనే పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నాయి.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిల్వ చేసిన ‘ట్యాబ్’ లకు చెందిన బాక్సులు
న్యూస్టుడే, భూపాలపల్లి: రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రభుత్వం ‘ట్యాబ్’లను పంపిణీ చేస్తూ, అందులోనే పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే ఏకరూప దుస్తులు పంపిణీ చేయనుంది. ఇప్పటికే వస్త్రం పంపిణీ చేయడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు స్కూల్ డ్రెస్స్లు కుట్టడానికి మహిళా సంఘాలకు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమగ్ర స్వరూపాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు గతంలోనే ‘యూ డైస్ ప్లస్’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు తమ చరవాణుల్లో సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేవారు. ఈ విధానంతో కొంతమేరకు ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రత్యేకంగా ట్యాబ్లు పంపిణీ చేయాలని గతంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ట్యాబ్లు సరఫరా చేసింది.
జిల్లాకు 294 ట్యాబ్లు..
భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 319 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 44 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాలోని 44 యూపీఎస్లకు ట్యాబ్లు 44 మంజూరు కాగా 319 పీఎస్లకు మొత్తం 250 వరకు ట్యాబ్లు వచ్చాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం జిల్లాకు 294 ట్యాబ్లు కేటాయించారు. వీటిని డీఈవో కార్యాలయంలోనే నిల్వ చేశారు. వీటి పంపిణీ కోసం ఇంకా స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. 150 కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు రెండేసి ట్యాబ్లు ఇస్తారు. ట్యాబ్ల వినియోగంపై మొదట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్షణ అధికారులు శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు తర్ఫీదునిచ్చి ట్యాబ్లు అందజేయనున్నారు. ‘తొలిమెట్టు’లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకం, బాలబాలికల వివరాలు, మన ఊరు-మన బడి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐఎస్ఎంఎస్ పోర్టల్, చైల్డ్ఇన్ఫో తదితర పూర్తి సమాచారాన్ని ట్యాబ్లలో పొందుపర్చనున్నారు.
తగ్గనున్న ఇబ్బందులు..
ఇంత వరకు పాఠశాలల్లో సమాచారాన్ని ఉపాధ్యాయులు వారి చరవాణుల్లో ఆన్లైన్ చేసేటప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేవి.. నేడు ఈ ట్యాబ్ల పంపిణీతో ఇబ్బందులు తొలగిపోనున్నాయని పలువురు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్ల కారణంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, సంక్షేమం గురించి వెంటనే తెలియపర్చడానికి అనుకూలంగా ఉంటుంది. యూ డైస్ ప్లస్లో ఎన్ని రకాల సమాచారం ఉంటుందో ట్యాబ్ల్లోనూ అంత సమాచారం నమోదుకు చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో