గ్రంథాలయాల రూపురేఖలు మారుస్తాం
జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాల రూపురేఖలు మార్చివేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ పోరిక గోవింద్నాయక్ హామీ ఇచ్చారు. మూతపడిన గ్రంథాలయాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.
వెంకటాపురం గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న ఛైర్మన్ గోవింద్నాయక్
ఏటూరునాగారం, న్యూస్టుడే: జిల్లాలోని ప్రభుత్వ గ్రంథాలయాల రూపురేఖలు మార్చివేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ పోరిక గోవింద్నాయక్ హామీ ఇచ్చారు. మూతపడిన గ్రంథాలయాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన ఏటూరునాగారం గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఐటీడీఏ పీవో సాయంతో భవనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. త్వరలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను, కుర్చీలు, బల్లల వంటి సామగ్రిని సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక గ్రంథపాలకుడు ఎండీ.యాకూబ్పాషా పాల్గొన్నారు.
వెంకటాపురం: విజ్ఞాన భాండాగారంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవింద్నాయక్ అన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. కనీసం దస్త్రాలు, పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో తాత్కాలిక స్వీపర్ను ప్రశ్నించారు. నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ మధుసూదన్ రూ.15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని తహసీల్దారు ఎ.నాగరాజును కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు రమణ, భారాస మండల అధ్యక్షుడు రాంబాబు, మండల కార్యదర్శి పి.మురళి పాల్గొన్నారు.
వాజేడు: మండలకేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవింద్నాయక్ తనిఖీ చేశారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలానికి సంబంధించిన పత్రాలను తహసీల్దారు లక్ష్మణ్ నుంచి తీసుకున్నారు. భారాస మండలశాఖ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, నాగారం ఉపసర్పంచి సతీశ్, అధికార ప్రతినిధి ఎల్లయ్య, ప్రచార కార్యదర్శి సాంబశివరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు