ఏజెన్సీలో గాలివాన బీభత్సం
మన్యంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
వెంకటాపురం-వాజేడు మార్గంలో రోడ్డుపై పడిన చెట్టు.. బురదలో చిక్కుకుపోయిన అంబులెన్స్
వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్టుడే: మన్యంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, ఇళ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసింది. గాలులకు నిల్వలపై కప్పిన టార్పాలిన్లు సైతం తొలగిపోయి కర్షకులకు నష్టాన్ని మిలిగ్చింది.
రహదారిపై కూలిన చెట్లు
ఈదురు గాలులతో వెంకటాపురం-వాజేడు ప్రధాన మార్గంపై చెట్లు నేలకూలాయి. ఎదుళ్లచెరువు సమీపంలో రోడ్డుపై వృక్షం పడటంతో రాకపోకలు నిలిచాయి. సమీపం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన అంబులెన్సు బురదలో చిక్కుకుపోయింది. సమాచారం మేరకు అర్అండ్బీ ఉద్యోగులు ఆలం శ్రీనివాస్, సిబ్బంది డోజర్ సాయంతో చెట్లను తొలగించారు. ఈ క్రమంలో దాదాపు గంటకు పైగా వాహన రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురంలోని కనకదుర్గ ఆలయం సమీప వీధిలో ఓ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా తొలగిపోయాయి. లోపల సామగ్రి సైతం ధ్వంసమైంది.
కర్షకులకు తీవ్ర నష్టం
తుపాను ప్రభావంతో ఆకస్మికంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. గాలివానతో ఒక్కసారిగా వ్యాపించిన వర్షంతో క్షేత్రాల వైపు కర్షకులు పరుగులు తీశారు. వెంకటాపురం శివారులోని ఇసుక పాయ, ఉప్పేడు, వాడగూడెం, మరికాల, రామచంద్రాపురం, వీరభద్రవరం ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసింది. పక్షం రోజుల కిందట కురిసిన వర్షంతో చేతికందిన పంట తాలుగా మారి నష్టం చేకూర్చగా ప్రస్తుత వర్షం మరింత నష్టాన్ని కలిగించిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
పిడుగులు, ఈదురుగాలుల ధాటికి విద్యుత్తుశాఖకు నష్టం జరిగింది. వెంకటాపురం మండలం ఉప్పేడులో 15 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్తు నియంత్రిక పేలింది. చొక్కాలలో రెండు, నూగూరులో మూడు, దానవాయిపేటలో రెండు స్తంభాలు విరిగాయి. కోయబెస్తగూడెం, ఉప్పేడు గొల్లగూడెం, వెంకటాపురం పట్ణంలోని శివాపురం, రెండు పడకల నివాసాల సముదాయం, కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రాంతాల్లో 11 కేవీ తీగలు తెగాయి. మండలంలో కరెంటు సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది.
మంగపేట: మండలంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోరునర్సాపురం సమీప పంట చేల వద్ద స్వల్పంగా రాళ్ల వాన కురిసింది. వరి పంట నేలవాలింది. పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ధాన్యం రాలిపోయింది. మిరప కల్లాల వద్ద మిర్చి పంట తడిసింది.
వెంకటాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) ప్రాంగణం తటాకాన్ని తలపించింది. వర్షానికి ప్రధాన భవనం చుట్టూ వరద భారీగా చేరింది. నీరు బయటికి వెళ్లేందుకు కాలువలు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది.
ఆసుపత్రి జలమయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్