వడివడిగా.. ఆయుష్మాన్ భారత్!
పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది.. ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఈకేవైసీ నమోదు
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్ : పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది.. ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం దేశ జనాభాలో 40 శాతం మంది అత్యంత పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. అలాంటి వారంతా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పేదలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం తరహాలోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఈకేవైసీ ద్వారా నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు.
చాలా మందికి అవగాహన లేక..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఈకేవైసీ నమోదు కేవలం 36 శాతమే నమోదు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76 మండలాలు ఉండగా దారిద్య్ర రేఖకు దిగువన 4.92 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 15.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరందరి వివరాలను ఈకేవైసీ ద్వారా నమోదు చేస్తేనే వారికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కార్యక్రమ అమలుకు సంబంధించి సరైన ప్రచారం కల్పించకపోవడంతో చాలా మందికి అవగాహన లేక ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు కావడంలో వెనకడుగు పడుతోంది.
దేశంలో ఎక్కడైనా..
రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించడంతో అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుంది. తాజాగా కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు అవకాశం కల్పించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రూ.5 లక్షలలోపు ఉచితంగా వైద్య చికిత్సలు పొందే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు పూర్తయితే సంబంధిత కార్డు పోస్టు ద్వారా ఇంటికి పంపించనున్నారు. ఈ కార్డు ఏ రాష్ట్రంలోనైనా అమలులో ఉండటంతో ఎక్కడైనా వైద్యం పొందే అవకాశం ఉంటుంది.
నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం..
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఈకేవైసీ నమోదుకు సంబంధించి గతంలో ఏఎన్ఎం, ఆరోగ్య మిత్రలతో నమోదు చేయించాం. కంటి వెలుగు కార్యక్రమం అమలులో ఉండటంతో నమోదులో కాస్త వెనకబడింది. తాజాగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈకేవైసీ నమోదు చేస్తున్నాం.
డాక్టర్ కమల్చంద్నాయక్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ