మావోయిస్టు యాక్షన్ టీం కమాండర్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్కుమార్ ఎదుట లొంగిపోయాడు.
జోగయ్యకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఓఎస్డీ అశోక్కుమార్
ములుగు, న్యూస్టుడే: మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్కుమార్ ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ.. 2016లో అప్పటి మిలీషియా కమాండర్ ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడని తెలిపారు. సంవత్సరం తర్వాత మావోయిస్టు సభ్యుడిగా పదోన్నతి పొందారన్నారు. ఆ తర్వాత చర్ల ఎస్జీఎస్ సభ్యుడిగా బదిలీ అయ్యాడన్నారు. 2020 వరకు సభ్యుడిగా పని చేసిన ఆయన ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది దామోదర్ భద్రతా సభ్యుడిగా బదిలీ అయ్యాడని తెలిపారు. యాక్షన్ టీం సభ్యుడిగా కమాండర్గా పదోన్నతి పొంది 2022 ఆగస్టు వరకు పని చేశాడని వివరించారు. ఇతడిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది లొంగిపోయినట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న అందరూ జన జీవన స్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి అన్ని రాయితీలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్భూషణ్పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు