మావోయిస్టు యాక్షన్ టీం కమాండర్ లొంగుబాటు
మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్కుమార్ ఎదుట లొంగిపోయాడు.
జోగయ్యకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఓఎస్డీ అశోక్కుమార్
ములుగు, న్యూస్టుడే: మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్కుమార్ ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ.. 2016లో అప్పటి మిలీషియా కమాండర్ ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడని తెలిపారు. సంవత్సరం తర్వాత మావోయిస్టు సభ్యుడిగా పదోన్నతి పొందారన్నారు. ఆ తర్వాత చర్ల ఎస్జీఎస్ సభ్యుడిగా బదిలీ అయ్యాడన్నారు. 2020 వరకు సభ్యుడిగా పని చేసిన ఆయన ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది దామోదర్ భద్రతా సభ్యుడిగా బదిలీ అయ్యాడని తెలిపారు. యాక్షన్ టీం సభ్యుడిగా కమాండర్గా పదోన్నతి పొంది 2022 ఆగస్టు వరకు పని చేశాడని వివరించారు. ఇతడిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది లొంగిపోయినట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న అందరూ జన జీవన స్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి అన్ని రాయితీలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!