ప్రజా భాగస్వామ్యం.. స్వచ్ఛ నగరానికి శ్రీకారం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 6 వేల పైచిలుకు పట్టణాల్లో ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం (మేరా లైఫ్.. మేరా స్వచ్ఛ షెహర్) కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తోంది.
చెత్త రహితంగా మార్చేందుకు ఆర్ఆర్ఆర్ కేంద్రాలు
ఆర్ఆర్ఆర్ కేంద్రంలో పాత దుస్తులు అందజేస్తున్న మహిళలు
న్యూస్టుడే, కార్పొరేషన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 6 వేల పైచిలుకు పట్టణాల్లో ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం (మేరా లైఫ్.. మేరా స్వచ్ఛ షెహర్) కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తోంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్- 2023’ పోటీలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్(ఆర్ఆర్ఆర్) కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరాన్ని చెత్తరహితంగా మార్చడమే వీటి లక్ష్యం.
ఏం చేస్తారంటే..
గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు చేపట్టి 66 డివిజన్లలో త్రిబుల్ ఆర్ కేంద్రాలను ప్రారంభించారు. ప్రజల నుంచి వినియోగించిన (పాత) పునరుత్పత్తి చేసే వస్తువులైన ప్లాస్టిక్, పాత దుస్తులు, పుస్తకాలు, పాద రక్షలు సేకరిస్తున్నారు. కేంద్రాల నిర్వహణ బాధ్యతలు స్థానిక స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. 15 రోజుల పాటు కేంద్రాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్ఆర్ఆర్ కేంద్రానికి బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఇలా పనిచేస్తాయి..
* రెడ్యూస్: పాత దుస్తులను స్థానిక ఆర్ఆర్ఆర్ కేంద్రంలో భద్రపరుస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని శుభ్రం చేసి మురికివాడల్లో నివసించే పేదలకు పంపిణీ చేస్తారు. చిత్తు కాగితాలు, పాత పుస్తకాలు సేకరించి హనుమకొండ పలివేల్పులోని ప్రధాన పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి తరలిస్తారు.
* రీ యూజ్: పాత బూట్లు, పాదరక్షలు సేకరిస్తారు. వీటిని పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి తరలిస్తారు. ఇందులో తోలు వేరు చేసి పునర్వినియోగిస్తారు.
* రీ సైకిల్: ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇ-వ్యర్థాలు సేకరిస్తారు. పొడి చెత్త నిర్వహణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడ బెయిలింగ్ మిషన్తో కట్టలు కట్టి రీ సైక్లింగ్ ప్లాంట్లకు తరలిస్తారు.
అందుబాటులో కేంద్రాలు
* ‘నా జీవితం.. నా స్వచ్ఛ నగరం’ కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వాములను చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ), స్వచ్ఛ కార్యకర్తలు, ఆర్డబ్ల్యూఏ సభ్యులు, కాలనీ కమిటీలు, యువజన సంఘాలు పాలుపంచుకుంటున్నాయి..
* స్థానిక ప్రజలకు అందుబాటులో ఆర్ఆర్ఆర్ కేంద్రం ఉంటుంది.
* ప్రతి కేంద్రంలో 10 మంది సభ్యులుంటారు. ఇంటింటికెళ్లి పాత దుస్తులు, పుస్తకాలు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్, పాత బూట్లు, చెప్పులు సేకరిస్తారు.
* సాధారణ గృహాలు, దుకాణాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాల నుంచి పాత వస్తువులు తీసుకుంటారు.
* ఆర్ఆర్ఆర్ సెంటర్లో ప్లాస్టిక్ సంచులు, ఫ్లెక్సీలు ఉండకుండా చూస్తారు.
అవగాహన కల్పిస్తున్నాం
‘నా జీవితం, నా స్వచ్ఛ నగరం’ కార్యక్రమంలో నగర ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తాం. నగరంలోని 66 డివిజన్లలో ఆర్ఆర్ఆర్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పాత దుస్తులు, పుస్తకాలు, చిత్తు కాగితాలు, పాత బూట్లు, ఇ-వ్యర్థాలు విధిగా అందజేసేలా అవగాహన కల్పిస్తాం. చారిత్రక ఓరుగల్లు నగరాన్ని చెత్త రహితం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.
గుండు సుధారాణి, మేయర్, గ్రేటర్ వరంగల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!