ఫిస్ట్బాల్లో రాణిస్తున్న యువకులు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు ఫిస్ట్బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చుతున్నారు.
తమిళనాడులో బంగారు పతకం సాధించిన తెలంగాణ జట్టు సభ్యులు(పాతచిత్రం)
పాలకుర్తి, న్యూస్టుడే: జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు ఫిస్ట్బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చుతున్నారు. పలు పోటీల్లో పాల్గొని పతకాలు, బహుమతులు అందుకున్నారు. ఇతర దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడ ఇప్పుడిప్పుడే మన దేశంలో ఆదరణ పొందుతోంది.
ఆట వివరాలివి..
ఫిస్ట్బాల్ కోర్టు 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక్కో జట్టులో మొత్తం 10 మంది క్రీడాకారులు ఉంటారు. వీరిలో ఐదుగురు మైదానంలో ఆడతారు. మరో ఐదుగురు ప్రత్యామ్నాయ సభ్యులుగా కోర్టు వెలుపల ఉంటారు. కోర్టులో ఆడుతున్న సమయంలో ఎవరికైనా గాయాలైతే.. బయట ఉన్న వారు జట్టు తరఫున వెంటనే బరిలోకి దిగుతారు. ఆట మొత్తం మూడు సెట్లలో ఉండగా.. 11 పాయింట్లు ఉంటాయి. ఒక జట్టు రెండు సెట్లలో గెలిస్తే విజేతగా ప్రకటిస్తారు. ఈ ఆట కొద్దిగా వాలీబాల్ క్రీడను పొలి ఉంటుంది.
సాధించిన విజయాలు
తెలంగాణ జట్టులో చెన్నూరుకు చెందిన బాలబోయిన సందీప్, జోడు సంతోష్ కొన్నేళ్లుగా ఆడుతున్నారు. గతేడాది మార్చిలో జరిగిన సౌత్జోన్ జాతీయస్థాయి పోటీల్లో వీరు ప్రథమస్థానంలో నిలిచారు. 2020-21లో 4వ సీనియర్ జాతీయస్థాయి ఛాంపియన్షిప్ (తమిళనాడు, కాంచిపురం)పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడి బంగారు పతకం సాధించారు. 2022 ఆగస్టులో పంజాబ్(లుథియానా)లో జరిగిన పోటీల్లో నాల్గో స్థానంలో, 2021 బిహార్లో జరిగిన పోటీలో ప్రథమస్థానం సాధించారు. గతేడాది జూన్లో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు.
నాలుగేళ్ల క్రితం ఎంపికయ్యాను
ఫిస్ట్బాల్ క్రీడపై నేటితరం యువకులు ఆసక్తి చూపాలి. హైదరాబాద్లో శిక్షణ తీసుకొని రాష్ట్రస్థాయి జట్టుకు నాలుగేళ్ల క్రితం ఎంపికయ్యాను. అప్పటి నుంచి తెలంగాణ తరఫున ఆడుతూ విజయాలు సాధిస్తున్నాం. చెన్నూరుకు చెందిన జోడు సంతోష్ నైపుణ్యం కలిగిన క్రీడాకారుడు. ఆయనతో కలిసి ఆడటం చాలా సంతోషంగా ఉంటుంది.
బాలబోయిన సందీప్, క్రీడాకారుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ