కొబ్బరి బోండం.. మరింత ప్రియం!
వేసవి ఎండల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే కొబ్బరి బోండాల ధరలు భారీగా పెరిగాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల భారం కూడా కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
న్యూస్టుడే, బాలసముద్రం
వేసవి ఎండల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే కొబ్బరి బోండాల ధరలు భారీగా పెరిగాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు రవాణా ఛార్జీల భారం కూడా కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, రాజమండ్రి, చింతపుడి, నిడదవోలు, పాలకొల్లు పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొబ్బరి బోండాలు దిగుమతి అవుతుంటాయి. ఆ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతున్న ఎండల కారణంగా చెట్ల పైకి ఎక్కి కాయలు కోసే కూలీలు రావడం లేదని దిగుమతిదారులు చెబుతున్నారు. బెంగళూరు, కేరళ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో రవాణా ఛార్జీలను కలుపుకొని ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్పత్తి తగ్గి వినియోగం పెరిగింది..
మే మొదటి వారంలో బోండాల ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. పది రోజుల నుంచి ఎండల తీవ్రత పెరగడంతో జనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. నగరంలో ఒక్కసారిగా వినియోగం పెరగడంతో అరకొరగా వస్తున్న సరకు సరిపోవడం లేదు.
* వరంగల్ నగరంలోని ప్రధాన కేంద్రాల్లో టోకు విక్రేతలు ఉన్నారు. వీరి నుంచి విడిగా విక్రయించే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. నగరానికి విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ వేసవిలో రోజుకు సగటున లక్ష బోండాలు అమ్ముతున్నారు. సుమారు 500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
బోండం ధర నెల కిందట రూ.30 ఉండేది.. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. లీటరు కొబ్బరు నీటికి రూ.100 తీసుకునేవారు. అలాంటిది రూ.130 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. పూజలకు వినియోగించే కొబ్బరి కాయ ధర రూ.5 వరకు పెరిగింది.
తప్పనిసరిగా కొంటున్నాం
సాత్పడి ఆంజనేయులు, నయీంనగర్
నెల కిందట బోండాల ధరలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒక్కసారిగా పెరిగాయి. మండుతున్న ఎండల కారణంగా కొనాల్సిన పరిస్థితి. నగరంలో కొన్ని చోట్ల బోండాలు విక్రయించే దుకాణాలను సరకు అందక మూసి వేశారు.
సరిపడా అందడంలేదు
తౌటం సదానందం, టోకు వ్యాపారి, హనుమకొండ
రోజుకు ఒక లారీ కొబ్బరి బోండాలు కావాలని ఆర్డరు చేస్తే వారానికి ఒక లారీ పంపిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం అక్కడ కాయలు తెంపే కూలీల కొరత ఏర్పడింది. కొన్ని సార్లు సరకు అందక దుకాణం మూసివేస్తున్నాం. వినియోగదారులతో పాటు రిటైల్ వ్యాపారులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.