‘బలోపేతం చేద్దాం.. అధికారంలోకి తీసుకొద్దాం’
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు.
రంగంపేట, పోచమ్మమైదాన్, న్యూస్టుడే: కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. బుధవారం వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని ఓ వేడుకల మందిరంలో జిల్లా బాధ్యతల స్వీకరణ, జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి పని చేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. ప్రాణం పోయే వరకు కాంగ్రెస్లోనే ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. పార్టీలో ఉంటూ గొడవలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని, ఈ నెల 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలు చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ. పూటపూటకు పార్టీ మారుతున్న నాయకులకు భవిష్యత్తు ఉండదని, ఆ నాయకులను నమ్మవద్దని తెలిపారు. కేవలం ఐదు నెలలు కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు. చిన్న చిన్న గొడవలు చేయించి కాంగ్రెస్ గెలుపును ఆపలేరని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు నూతన అధ్యక్షురాలిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సమావేశానికి రాష్ట్ర పరిశీలకురాలిగా శోభారాణి హాజరవగా, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
కొండా దంపతులు దూరం
వరంగల్ జిల్లా కాంగ్రెస్ తొలి విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. పరకాల నియోజకవర్గానికి చెందిన నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గొడవ జరగడాన్ని టీపీసీసీ సీరియస్గా పరిగణించింది. కారణమైన వారిపై క్రమ శిక్షణ చర్యలకు సిద్ధమైంది. మొదటి సమావేశానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దూరంగా ఉండటంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశానికి ఆహ్వానం లేదని కొండా దంపతులంటున్నారు. ఒకటి రెండుసార్లు చరవాణిలో మాట్లాడామని, బుధవారం సమావేశం గురించి చెప్పానని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అంటున్నారు. డీసీసీ అధ్యక్షురాలి నియామకమైన నాటి నుంచే కొండా, స్వర్ణ మధ్య విభేదాలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇరువురు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. వరంగల్ తూర్పులో నాకు తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా డీసీసీ అధ్యక్షురాలు పర్యటించడం ఎంతవరకు పద్ధతి అని కొండా అంటున్నారు. నేను జిల్లా అధ్యక్షురాలినని, ఎక్కడైనా పర్యటిస్తానని స్వర్ణ అంటున్నారు. తూర్పు ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే బుధవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి కొండా దంపతులు, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారని తెలిసింది. ఉదయం పోచమ్మమైదాన్లో సమావేశానికి గైర్హాజరైన మాజీ ఎమ్మెల్సీ మురళి సాయంత్రం లేబర్కాలనీ, రంగశాయిపేటలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారు.
ఠాణాలో పరస్పరం ఫిర్యాదులు
మట్టెవాడ: కార్యకర్తల సమావేశంలో దాడుల ఘటనపై ఇరువర్గాలు ఇంతేజార్గంజ్ ఠాణాలో ఫిర్యాదులు చేసుకున్నారు. జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు దూపాకి సంతోష్, ఇతరులు కట్టస్వామిపై కులం పేరుతో దూషించి, తీవ్రంగా అవమానపరిచాడని ఫిర్యాదు చేశారు. అకారణంగా తనపై దూపాకి సంతోష్, ఇతరులు దాడి చేశారని కట్టస్వామి ఫిర్యాదు చేశారు. దాడి ఘటనలో తన చరవాణి, బంగారు గొలసు పోయినట్లు తెలిపారని, రెండు వర్గాల ఫిర్యాదులు అందాయని ఇంతేజార్గంజ్ సీఐ మల్లేష్ తెలిపారు.
ఆగిన కాంగ్రెస్ సమావేశం
రంగశాయిపేట: మద్యం ప్రియుల హల్చల్ కారణంగా శంభునిపేటలో జరగాల్సిన కాంగ్రెస్ సమావేశం రద్దైంది. బుధవారం సాయంత్రం స్థానిక వేడుకల మందిరంలో 41వ డివిజన్కు చెందిన భారాస యువకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు సమక్షంలో చేరికల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొంత మంది మద్యం ప్రియులు అక్కడికి చేరుకొని కార్యక్రమం ఎవరు పెట్టారంటూ అద్దాలు పగుల గొట్టారు. ద్విచక్ర వాహనాలను కింద పడేశారు. దీంతో అర్ధంతరంగా కార్యక్రమాన్ని రద్దు చేసి లేబర్కాలనీకి మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరీశ్రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్రెడ్డి
[ 24-04-2024]
మాజీ మంత్రి హరీశ్రావు సవాల్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్రావు రాజీనామా చేస్తామంటున్నారు. -
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్