నవ రంగాలు.. ప్రగతి సోపానాలు
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, విద్యుత్తు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోంది.
రేపటితో పదో వసంతంలోకి తెలంగాణ
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, విద్యుత్తు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడి రేపటితో తొమ్మిదేళ్లు పూర్తవుతున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా తొమ్మిది రంగాల్లో సాధించిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం..
1.విద్యకు పెద్దపీట
ఉమ్మడి జిల్లాలో విద్యావెలుగులు ప్రసరిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. సర్కారు బడులకు కార్పొరేట్ కళను తీసుకొచ్చేందుకు ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమం అమలవుతోంది.
ఉమ్మడి జిల్లాలో..
* ప్రభుత్వ బడులు: 3,328
* గురుకుల, ఆశ్రమ పాఠశాలలు: 255
* మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలు: 949
* కేటాయించిన నిధులు (రూ.కోట్లలో): 208.45
2.సాగులో భళా
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. కాళేశ్వరంతో సాగునీటి సౌకర్యం మెరుగుపడింది. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల్లోని పూడిక తీతతో భూగర్భ జలాలు పెంపొందాయి. ఎస్సారెస్పీ కాలువలను పునరుద్ధరణ చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందుతోంది. 24 గంటల ఉచిత కరెంట్తో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్నాయి. రైతువేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు.5వేల ఎకరాలకు ఒక ఏఈవోను కేటాయించారు.
* సాధారణ సాగు విస్తీర్ణం (ఎకరాల్లో): 18,02,280
* సాగవుతున్న ఆయిల్పామ్ విస్తీర్ణం (ఎకరాల్లో): 13,401
* రైతు వేదికలు: 349
3. సకల జనుల సంక్షేమం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఆసరా, దళిత బంధు, ట్రైకార్, ఆరోగ్యలక్ష్మి, న్యూట్రిషన్ కిట్లు, గొర్రెల పంపిణీ, రైతులకు పెట్టుబడి సాయం, రైతుబీమా ఇలా పలురకాల పథకాలు ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
4. అందరికీ ఆరోగ్యం
వైద్యరంగంలో గొప్ప మార్పు వచ్చింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తోంది. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి సుమారు 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. పల్లెదవాఖానాలను ఏర్పాటు చేసి వైద్యులతో సేవలందిస్తున్నారు. కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాలు అమలవుతున్నాయి.
5. మౌలిక సదుపాయాలు
* ఉమ్మడి జిల్లాలో రహదారి కష్టాలు తీరాయి. జాతీయ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులు 14,192.57 కిలోమీటర్లు విస్తరించాయి.
* పల్లెల్లో వైకుంఠధామాలను నిర్మించారు. ఇంటింటా సేకరించిన చెత్తను గ్రామశివారుల్లో వేసేందుకు డంపింగ్యార్డులను నిర్మించారు. పల్లె, పట్టణ పకృతి వనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నారు.
6. పర్యాటకానికి చిరునామాగా
చారిత్రక కాకతీయుల కట్టడాలు, నింగిని తాకే జలపాతాలు, పురాతన ఆలయాలు, పచ్చని అడవులతో రమణీయమైన ప్రకృతికి నెలవు ఉమ్మడి వరంగల్.. రాష్ట్రం ఏర్పడ్డాక పర్యాటక ప్రాంతాలు ప్రాచుర్యం పొందాయి. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. ఏటూరునాగారం అభయారణ్యంలో ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, వనకుటీరాలు, బర్డ్స్ వాచింగ్ లాంటి కార్యక్రమాలతో ప్రకృతి పర్యాటకం ఊపందుకుంది. పాండవుల గుట్టలు, జైన్ మందిర్, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి బండ్, పాలకుర్తి, వల్మిడి, బమ్మెర టూరిజం కారిడార్ను అభివృద్ధి పర్చారు.
* లక్నవరం సరస్సు వద్ద రూ. 5 కోట్లతో నూతన తీగల వంతెన నిర్మించారు.
* పాలకుర్తి, వల్మిడి, బమ్మెర, టూరిజం కారిడార్కు రూ. 61.67 కోట్లు కేటాయింపు.
* దివంగత మాజీ ప్రధాని పీˆవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో పర్యాటకాభివృద్ధికి రూ.4 కోట్లు
* గిరిజన పర్యాటక వలయం(ట్రైబల్ సర్క్యూట్) కింద రూ.88 కోట్లతో ఆరుచోట్ల హోటళ్లు, కాటేజీలను నిర్మించారు.
* హరిత హోటళ్ల సంఖ్య: 17
* ఉమ్మడి జిల్లాకు వచ్చే పర్యాటకులు: 25 లక్షలు
7. పారిశ్రామికాభివృద్ధి
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక రంగం ఊపందుకుంది. ప్రభుత్వం పరిశ్రమల అనుమతులకు టీఎస్ఐపాస్తో ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది.
* భూపాలపల్లి జిల్లాలో 4 భూగర్భ, 2 ఉపరితల బొగ్గు గనులతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సింగరేణిలో కార్మికులకు 2017 నుంచి కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టి 1200 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించింది.
* గణపురం మండలం చెల్పూరు శివారు దుబ్బపల్లిలో 1100 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ప్రాజెక్టులో 850 మంది ఇంజినీర్లు, జేపీఏలు, ఆర్టిజన్లు తదితర కార్మికులు 2వేల మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 600 మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించింది.
* జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కల్లెం, మాణిక్యాపురంలలో దాదాపు 10 వేల మందికి ఉపాధి కలిగే 150 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు పనులు జరుగుతున్నాయి.
* గీసుకొండ, సంగెం మండలాల్లో మెగా టెక్స్టైల్ పార్కులో గణేశ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. రూ. 300 కోట్లతో కంపెనీ ప్రారంభించగా.. దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తోంది. కైటెక్స్ కంపెనీ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నారు.
* తరిగొప్పుల, దేవరుప్పులలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం భూసేకరణ చేపడుతున్నారు.
* చిన్న పరిశ్రమలు: 9251
8. విద్యుత్తు వెలుగులు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోతలు లేని విద్యుత్తు సరఫరా అవుతోంది. బిల్లులపై భారం తగ్గింది. గృహాలు, వ్యవసాయానికి నిరంతరాయం సరఫరా చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా కోతలు లేని విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కరెంట్ సమస్యలు లేకుండా ఆశాఖ అధికారులు దత్తత తీసుకొని పరిష్కరిస్తున్నారు.
9. క్రీడలకు అందలం
ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవ లేదు. క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహం కల్పిస్తోంది. పల్లెల్లోని క్రీడాకారులను కూడా ప్రోత్సహించేందుకు పల్లె క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తెచ్చింది.
మెరుగుపడిన గురుకుల విద్య
- మైస శ్రీనివాస్, టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రం ఏర్పడ్డాక గురుకులాల్లో విద్య మెరుగుపడింది. గ్రామ బడులు మూసివేయకుండా కొనసాగించాలి. వాటిలోనూ గురుకులాల స్థాయి సౌకర్యాలు కల్పించాలి.
బీడు భూములు వృద్ధిలోకి వచ్చాయి
- నేతాజీ, రైతు, చిన్నముప్పారం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఎస్సారెస్పీ కాలువల పునరుద్ధరణతో సాగునీటి కష్టాలు తప్పాయి. పుష్కలంగా నీరందుతుండడంతో బీడు భూములు వృద్ధిలోకి వచ్చాయి. ప్రభుత్వం రాయితీ ద్వారా ఆధునిక యంత్రాలను అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు