ఏఎన్ఎంలకు రక్తపోటు పరీక్షల కిట్లు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య సిబ్బంది ఇళ్లకే వచ్చి ప్రజల రక్తపోటు స్థాయిని పరీక్షించి ఏ మందులు వాడాలో సూచిస్తారు.
దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్టుడే: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య సిబ్బంది ఇళ్లకే వచ్చి ప్రజల రక్తపోటు స్థాయిని పరీక్షించి ఏ మందులు వాడాలో సూచిస్తారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలు వస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఏఎన్ఎంలకు డిజిటల్ రక్తపోటు నిర్ధారణ కిట్లను అందించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
జిల్లాకు చేరిన పరికరాలు
ఈ పరికరాలు మంగళవారం జనగామ జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ఏఎన్ఎంలకు అందజేయనున్నారు. జిల్లాలో సుమారు 150 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. ప్రస్తుతం గర్భిణుల ఆరోగ్య పరిరక్షణలో వీరు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీనికి తోడుగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు రక్తపోటు పరీక్షలు చేస్తారు. బాధితుల వివరాలను సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేస్తారు. ఆరోగ్య కేంద్రాలకు చేరాక అక్కడి వైద్యులు బాధితులను మరోసారి పరీక్షించి వివరాలు నమోదు చేసుకొని ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. అవసరమైన మందులను అందిస్తారు.
ఇప్పుడేం జరుగుతోంది?
బాధితులు ఆసుపత్రుల్లో చేరిన తర్వాత రక్తపోటును నిర్ధారించి మందులు ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకొని మందులను వైద్యుడికి చూపించాలని చెబుతున్నా.. బాధితులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం రక్తపోటు స్థాయిని కూడా గమనించలేకపోతున్నారు. దీంతో జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపి ఒక్కోసారి ప్రాణాల మీదికి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇకపై ఇలా..
ఏఎన్ఎంలకు డిజిటల్ బీపీ యంత్రాలను అందించడంతో వారు బాధితులను గుర్తించి వారి వివరాలను పీహెచ్సీకి పంపిస్తారు. అక్కడి వైద్యులు మరింత లోతుగా పరీక్షించి మందులు రాస్తారు. వీటిని క్రమం తప్పకుండా వాడేలా ఏఎన్ఎంలు కుటుంబ సభ్యులకు వివరిస్తారు. వారు రోజూ మందులు వేసుకుంటున్నారో లేదో ఆరా తీస్తారు. ప్రతి మూడు నెలలకోసారి పరీక్షలు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మందులు కొనసాగించాలా మార్చాలా అన్నది అక్కడి వైద్యులు సూచించి మందులు అందిస్తారు.
ఈ కార్యక్రమంతో బాధితులకు ఉపశమనం
- ప్రశాంత్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి
ఏఎన్ఎంలకు బీపీ పరీక్షల కిట్లు ఇవ్వనున్నట్లు సమాచారం అందింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న రక్తపోటును గుర్తించి మందులు వాడకుంటే పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. ప్రభుత్వ విధానంతో చాలామంది రక్తపోటు బాధితులకు ఉపశమనం కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు