విక్రయానికి సిద్ధంగా ప్రభుత్వ భూమి..
ప్రభుత్వమే లే అవుట్ చేసి ప్రజలకు స్థలాలను అమ్మడానికి కసరత్తు ప్రారంభించింది. క్రయవిక్రయాలకు వీల్లేని ప్రభుత్వ, అసైన్డ్ భూములను లే అవుట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పురపాలిక పరిధిలో లే అవుట్కు ఏర్పాట్లు..
భూపాలపల్లి, న్యూస్టుడే: ప్రభుత్వమే లే అవుట్ చేసి ప్రజలకు స్థలాలను అమ్మడానికి కసరత్తు ప్రారంభించింది. క్రయవిక్రయాలకు వీల్లేని ప్రభుత్వ, అసైన్డ్ భూములను లే అవుట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని భూములతో పాటు భూ యజమానులు ముందుకొస్తే ప్రైవేటు భూముల్లో లే అవుట్ చేసి బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి సమాయత్తమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాశీంపల్లి వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 10ఎకరాల ప్రైవేట్ భూమిని గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది.
ప్రైవేట్ స్థలాల్లోనూ..
ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాకుండా ప్రైవేటు భూముల్లోనూ ప్రభుత్వ పరంగా లే ఆవుట్ చేసి, వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఏయే ప్రాంతంలో లే అవుట్ చేస్తే ఫలితాలు వస్తాయి, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేట్ భూముల లెక్కలను అధికారులు ఆరా తీస్తున్నారు. అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న వేశాలపల్లి, జంగేడు, కాశీంపల్లి ప్రాంతాల్లో అధికారులు భూముల సేకరణపై దృష్టి పెట్టారు. ఆసిక్తి కలిగిన రైతులు, భూ యజమానులు ముందుకు వస్తే వారి భూముల వివరాలను పరిశీలించి హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు జిల్లా అధికారులు నివేదిస్తారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాకే ప్లాట్ల విక్రయాలు చేపడుతారు. భూములు లే అవుట్కు అప్పగిస్తే భూ యజమానులకు, రైతులకు చెల్లింపులు ఎలా చేస్తారనే దానిపై పూర్తి మార్గదర్శకాలు తెలియాల్సి ఉంది.
కనీసం 20 ఎకరాలు
ప్లాట్లు చేయడానికి అనుకూలంగా ఉండాలంటే ఒకే చోట సుమారుగా 20 ఎకరాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. రైతులు, భూ యజమనాలు ముందుకు వస్తే అనుమతులన్నీ అధికారులే చూసుకుంటారు. మురుగు కాల్వలు, రహదారులు, ప్రజా అవసరాల రీత్యా ఉద్యానవనం, ప్రార్థన మందిరాలకు పది శాతం స్థలం వదలడం, విద్యుత్తు సౌకర్యం, తాగునీటి వసతి వంటి తదితర మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది. మొత్తం స్థలంలోనే 40 శాతం మురుగు కాల్వలు, రోడ్ల నిర్మాణాలకే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిగితా 60 శాతం స్థలంలో ఏర్పాటైయ్యే ప్లాట్లలో సగం భూమి యజమానికి అప్పగిస్తుంది. మిగితా సగం ప్లాట్లు ప్రభుత్వం వేలం పాటల్లో విక్రయిస్తుంది. భూమి రకాన్ని బట్టి ఒకవేళ ప్లాట్ల ఏర్పాటుకు అధికంగా ఖర్చయితే యజమానికి 40 శాతం, ప్రభుత్వానికి 60 శాతం ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుంది. అసైన్డ్, ప్రైవేటు భూముల్లో లే అవుట్ చేయాలంటే సదరు రైతులు సమ్మతిస్తేనే అధికారులు ఈ ప్రక్రియ మొదలు పెడతారు. ఈ విషయమై భూపాలపల్లి తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ప్లాట్లు చేసి విక్రయించాలనే ఆదేశాలు కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి వచ్చాయని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు సర్వే నెంబర్లలలో 20 ఎకరాల వరకు భూములను ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి