ప్రగతి బాటలో మానుకోట..!
అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించుకున్నాం.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, మహబూబాబాద్: అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించుకున్నాం. గిరిజన జిల్లా అయిన మానుకోట ప్రగతి బాటలో పయనిస్తోంది. ఈ అభివృద్ధి మార్గం ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ సంకల్పానికి బలం చేకూరుతోంది.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాలకు ఆమె ముఖ్య అతిథి హాజరయ్యారు. అంతకు ముందు ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పరిపాలన కేంద్రీకరణలో భాగంగా ఏర్పడ్డ మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి సర్కారు రూ. వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే..
సంక్షేమం
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో 19 ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, తొమ్మిది కళాశాల వసతి గృహాలు, 104 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 8,861 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ట్రైకార్ ద్వారా గిరిజన లబ్ధిదారులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.20.85 కోట్లతో 732 మందికి 2,606 యూనిట్లు లబ్ధి చేకూర్చాం. 1,12,395 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాంÙ. ఇందుకు నెలకు రూ.1658 కోట్లు వెచ్చిస్తున్నాం. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 30,954 మందికి రూ.26.98 కోట్లు మంజూరు చేశాం.
విద్యకు పెద్దపీట
కార్పొరేట్ తరహాలో సర్కారు బడుల సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి దశలో 316 పాఠశాలలను ఎంపిక చేశాం. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ. 26 కోట్లు, ప్రభుత్వ నిధులు రూ.46 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నాం.
వ్యవసాయాభివృద్ధి
2022-23లో జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్లో 6,08,028 ఎకరాలు సాగు చేశారు. 1,80,406 మంది అన్నదాతలకు రైతుబంధు పథకంలో పెట్టుబడి సాయంగా రూ.1640 కోట్లు అందించాం. 2023లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తాం. ఈ ఏడాది 8,264 ఎకరాల్లో పంటనష్టపోయిన 24,958 మంది రైతులకు రూ.2,066 లక్షల నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికను అందించాం. జిల్లాలో 6,067 ఎకరాల్లో 1374 మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ
2022 వరకు ప్రభుత్వ స్థలాలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్ల స్థలాలను జీవో నంబరు 58, 59లో క్రమబద్ధీకరించనున్నాం. 58 జీవో ఉత్తర్వుల ప్రకారం 5401 దరఖాస్తులకు 742 మందికి పట్టాలు అందించాం. 59 జీవో ఉత్తర్వుల ప్రకారం 1390 దరఖాస్తులకు 370 మందికి పట్టాలు ఇచ్చాం. పొడిగించిన గడువు ప్రకారం జీవో నంబరు 58 ఉత్తర్వులకు 5159, జీవోనంబరు 59 ఉత్తుర్వులకు 973 దరఖాస్తులు స్వీకరించాం.
పోడు రైతులకు పట్టాలు
అడవులనే నమ్ముకుని జీవిస్తున్న అదివాసుల జీవన సంస్కృతులను కాపాడటానికి సర్కారు కృషి చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించేలా పోడు పట్టాలందించబోతున్నాం. జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 152 పంచాయతీలోని 320 హ్యాబిటేషన్ల రైతులను గుర్తించాం. 24,181 ఆర్జీలను పరిష్కరించాం. 67,730 ఎకరాలకు పట్టాలు అందజేయనున్నాం.
ఆరోగ్యమే ఆనందం
జిల్లాలో మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల మంజూరైంది. ఈ ఏడాది నుంచే బోధన కొనసాగిస్తున్నాం. రూ.550 కోట్లతో వైద్యకళాశాల, అనుబంధంగా రూ.40 కోట్లతో 200 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. జిల్లా ఆసుపత్రిని 330 పడకల ప్రభుత్వ సాధారణ వైద్యశాలగా ఉన్నతీకరించాం. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 5 పీహెచ్సీలను ఎంపిక చేశాం.
* అమర వీరుల కుటుంబాలను సన్మానించి. వివిధశాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి అవార్డులను అందించారు. వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ డెవిడ్, డీఎఫ్వో రవికిరణ్, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ