మందకొడిగా ‘కవచ్’ పనులు
ఒడిశా రైలు ప్రమాదంతో ఆ శాఖ దిగ్భ్రాంతికి లోనయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనతో భారతీయ రైల్వే చేపట్టిన ‘కవచ్’ నిర్మాణ పనులు మరోసారి తెరమీదకు వచ్చాయి.
రైలు ఇంజిన్లో కవచ్ యంత్రం (డీఎంఐ)
కాజీపేట, న్యూస్టుడే: ఒడిశా రైలు ప్రమాదంతో ఆ శాఖ దిగ్భ్రాంతికి లోనయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనతో భారతీయ రైల్వే చేపట్టిన ‘కవచ్’ నిర్మాణ పనులు మరోసారి తెరమీదకు వచ్చాయి. అత్యంత రద్దీగా ఉండే కీలకమైన కాజీపేట- సికింద్రాబాద్ మధ్య ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే రైళ్లను సెన్సర్ల ద్వారా గుర్తించడం, పట్టాలమీద పడిన వస్తువులను గుర్తించి రైలు దానికదే ఆగిపోయే విధంగా రూపొందించిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఇది.
* ప్రతి రోజు కాజీపేట, వరంగల్ మీదుగా వందకు పైగా రైళ్లు ప్రయాణం చేస్తాయి. బల్లార్షా- వరంగల్- విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణం కూడా జరుగుతోంది. ఈక్రమంలో రైళ్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కవచ్ నిర్మాణం వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల ద్వారా నడిచే రైళ్లకు త్వరగా అనుసంధానించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
టవర్ల నిర్మాణ దశలోనే..: ప్రస్తుతం సికింద్రాబాద్ - కాజీపేట 135 కి.మీ. మార్గంలో ఆయా రైల్వే స్టేషన్లలో కవచ్కు సంబంధించిన టవర్ల నిర్మాణం జరుగుతోంది. రైల్వే పట్టాల మీద రేడియేషన్ ప్లేట్లు, ప్రతి రైల్వే గేటు వద్ద సెన్సర్లు, రైల్వే స్టేషన్ల వద్ద టవర్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికి ఇవి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టవచ్చని తెలిపారు.
ఈ మార్గంలో అత్యవసరం..
కాజీపేట- విజయవాడ, కాజీపేట- బల్లార్షా మార్గంలో నిత్యం అనేక రైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. బల్లార్షా- విజయవాడ మార్గం గ్రాండ్ట్రంక్ రూట్ (అత్యధికంగా రైళ్లు ప్రయాణం చేసే మార్గం)గా పేరుపొందింది. బల్లార్షా మార్గం నుంచి కాజీపేటకు అత్యధికంగా గూడ్సు రవాణా జరుగుతోంది. ఇలాంటి మార్గంలో కవచ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. రెండో దశ పూర్తయిన తర్వాత బల్లార్షా- వరంగల్- విజయవాడ మార్గంలో కవచ్ నిర్మాణం జరిగే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM