ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తాం
వరంగల్ జిల్లాలో రూ.100 కోట్లతో ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం(ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా పాలనాధికారి ప్రావీణ్యకు సూచించారు.
రైతు దినోత్సవ సభలో మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
జ్యోతివెలిగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఎనుమాముల మార్కెట్, న్యూస్టుడే: వరంగల్ జిల్లాలో రూ.100 కోట్లతో ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం(ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా పాలనాధికారి ప్రావీణ్యకు సూచించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో శనివారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. గత ప్రభుత్వాల కాలంలో రైతులు కరెంటు కష్టాలతో తల్లడిల్లేవారని, ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరాతో రైతుల పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం రైతులు తమ పంట కాలాన్ని నెల రోజులు ముందుకు తీసుకురావాలని, వానాకాలం పంటలను జూన్ 15 లోపు, యాసంగి పంటలను నవంబరు 10లోపు వేయాలని సూచించారు. తద్వారా అకాల వర్షాల నుంచి పంటలను రక్షించుకోవచ్చన్నారు. దొడ్డు రకం ధాన్యం పండించడం వల్ల నష్టాలు చవిచూస్తున్నారని.. కొత్త వంగడాలు, సన్నరకం ధాన్యం రైతులు సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి రిసోర్స్ కేంద్రం, స్పైసెస్ డెవలప్మెంట్ ల్యాబ్, ఆగ్రో బేస్డ్ జోన్స్, రూ.2 కోట్లతో ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ల ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ ఆదాయంలో 30- 40 శాతం మార్కెట్ అభివృద్ధికి ఖర్చుచేయాలన్నారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, జడ్పీ ఛైర్పర్సన్ గండ్రజ్యోతి, పాలనాధికారి ప్రావీణ్య, సీపీ ఏవీ.రంగనాథ్ మాట్లాడారు. పలువురు రైతులను సన్మానించారు. మార్కెట్ ఛైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినీ తానాజీ, కార్యదర్శి రాహుల్, జేడీఎం మల్లేషం, డీడీఎం రాజు, డీఎంవో ప్రసాద్రావు, రైతుబంధు సమితి అధ్యక్షురాలు లలితాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీల్లో ఫొటోల రగడ
రైతు దినోత్సవం సందర్భంగా మార్కెట్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ముద్రించిన ఫొటోల విషయంలో శనివారం ఉదయం ఛాంబర్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి మార్కెట్ కార్యదర్శి రాహుల్ను నిలదీశారు. మార్కెట్ ఛైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అయితే ఆమె భర్త ఫొటో ఫ్లెక్సీలో ఎందుకు వేశారని అడిగారు. జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి ఫొటో ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. సమావేశం ప్రారంభంలోనే ఈ విషయంలో వాడివేడీ సంభాషణలు జరగడంతో సభా ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పండగలా మారిన వ్యవసాయం
రాయపర్తి: ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు తదితర సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండగలా మారిందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాయపర్తి, పెర్కవేడు, మొరిపిరాల, కాట్రపల్లి, కేశవాపూర్లోని రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కోలాటం ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. ఉత్తమ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!