పుర ఆదాయానికి గండి ట్రేడ్ లైసెన్స్లపై దృష్టి ఏదీ?
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ల జారీపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ‘పుర’ ఆదాయానికి గండి పడుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది.
న్యూస్టుడే, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ల జారీపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ‘పుర’ ఆదాయానికి గండి పడుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నింటికీ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి చేసింది. ఇన్నాళ్లు అవసరమైన దుకాణదారులు మాత్రమే అనుమతి పత్రం తీసుకొనేందుకు ముందుకొచ్చేవారు. లైసెన్స్ల జారీలో నిర్లక్ష్యం, అరకొర ఆన్లైన్ విధానంతో ఆదాయం లక్ష్యం నీరుగారుతోంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో 1,601 వరకు దుకాణాలున్నాయి. అనధికారికంగా మరో 200లకు పైగానే ఉంటాయని అంచనా.. ఇప్పటివరకు 774 దుకాణాలను మాత్రమే అధికారులు ఆన్లైన్ చేశారు. దీంతో రూ.లక్షలాది రూపాయల ఆదాయం సమకూరాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో భారీగా ఆదాయానికి గండి పడుతోంది. ట్రేడ్ లైసెన్సుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పురపాలక సంఘానికి రూ.15.66 లక్షల వరకు డిమాండ్ ఉంటే ఇప్పటి వరకు రూ.8.01 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న దుకాణాలు..
రోజురోజుకు పట్టణ విస్తీర్ణంతో పాటు కొత్తగా ఏర్పడుతున్న కాలనీలతో దుకాణాల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు రహదారులు, ప్రధాన కేంద్రాలకు పరిమితమైన వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఫలహార శాలలు, పాన్ షాపులు కాలనీల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలక సంఘంపై పడింది. ఈ భారాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మెకానిక్, వడ్రంగి, వెల్డింగ్, ఎంటర్ప్రైజెస్, రైస్ మిల్లులు, పూల దుకాణాలు, తదితర వ్యాపార సంస్థల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్సు జారీ చేసి, ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు అవసరమైన మేర చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిధుల్లేక పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. దుకాణాలను మొత్తం ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు నెలకొన్నాయి.
లైసెన్సులు తీసుకునేలా చర్యలు : నరేష్, శానిటరీ ఇన్స్పెక్టర్
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో దుకాణదారులు ట్రేడ్ లైసెన్సులు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు లైసెన్సులు తీసుకోని వారికి పాలక సభ్యుల ఆమోదం మేరకు నోటీసులు జారీ చేస్తాం. బాధ్యతగా ప్రతి వ్యాపారి కొత్త నిబంధనల ప్రకారం ట్రేడ్ లైసెన్సులు తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా