నాయకత్వ లక్షణాలపై ఆన్లైన్ శిక్షణ
వేసవి సెలవులు ముగిసి మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. జిల్లాలో ఇప్పటికే బడిబాటకు శ్రీకారం చుట్టారు.
డోర్నకల్, న్యూస్టుడే: వేసవి సెలవులు ముగిసి మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. జిల్లాలో ఇప్పటికే బడిబాటకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాఠశాల నిర్వహణ అంశంపై ఒక ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్పుతో కూడిన బోధన, ఉపాధ్యాయుల భాగస్వామ్యం పెంచడం, సూక్ష్మ దృష్టి లక్ష్యంగా ఎంహెచ్ఆర్డీ (కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన (న్యూపా) ఈ ఆన్లైన్ కోర్సు నిర్వహణకు సంకల్పించింది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలతో పాటు జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, పిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు యూడైస్ కోడ్తో పేర్లు నమోదు చేసుకుని శిక్షణలో భాగస్వామ్యమయ్యే వీలు కల్పించారు.
విద్యా ప్రమాణాలు పెంచేందుకే..
కొవిడ్-19 తర్వాత జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరిగింది. వివిధ రకాల ఉచిత పథకాల అమలుకు తోడు ‘మన ఊరు-మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం వసతులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని 1025 బడుల్లో లక్ష మందికి పైగా విద్యార్థులుండగా వీరికి బోధించడానికి సుమారు 5 వేల మంది ఉపాధ్యాయులున్నారు. పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాల సాధన ఆశించిన మేరకు ఉండటం లేదు. దీనిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నాయకత్వం, సమర్థ నిర్వహణ, అభివృద్ధి అనే అంశాలపై ఆన్లైన్ కోర్సు ప్రారంభించింది. ఇందులో బడుల నాయకత్వ దృక్పథం, స్వీయ అభివృద్ధి, బోధన అభ్యసన ప్రక్రియను మార్చడం, బిల్డింగ్, లీడింగ్ బృందాల సృష్టి, ప్రముఖుల ఆవిష్కరణలు, ప్రముఖుల భాగస్వామ్యాల పాఠశాల పరిపాలన, బడి అభివృద్ధి ప్రణాళికను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. వీటిని ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే వారిలో ప్రమాణాలు పెరుగుతాయనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. విజయవంతంగా శిక్షణ పూర్తిచేస్తే ఆన్లైన్ ధ్రువపత్రం అందుతుంది.
వెబ్సైట్ ఇదీ
శిక్షణ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్ఎల్ఎం.ఎన్ఐఇపీఏ.ఏసీ.ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, వివరాలు, మెయిల్ ఐడీ, ఉద్యోగి సంఖ్య, చిరునామా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సిద్ధం చేయాలి. కోర్సు ప్రారంభమైన రోజు నుంచి వెబ్సైట్లో స్టడీ మెటీరియల్తో సబ్జెక్టులను చదువుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!