చెరువుల పండగకు వేళాయే..
చెరువుల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా వాటికి మరమ్మతులు చేపటి పటిష్ఠం చేసింది.
విద్యుత్తు కాంతుల్లో భద్రకాళి బండ్
న్యూస్టుడే, కార్పొరేషన్ : చెరువుల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా వాటికి మరమ్మతులు చేపటి పటిష్ఠం చేసింది. వివిధ పథకాల ద్వారా అభివృద్ధి, సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండగ నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటల వద్ద గురువారం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో భద్రకాళి బండ్, వరంగల్ జిల్లాలో ఉర్సు చెరువు, ఖిలావరంగల్ గుండు చెరువు వద్ద మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇదీ అభివృద్ధి..: గ్రేటర్ పరిధిలో పలు చెరువులు, కుంటలను ప్రభుత్వం అభివృద్ధి పరుస్తోంది. హృదయ్, స్మార్ట్సిటీ, సీఎం హామీల నిధులతో సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ప్రత్యేక పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భద్రకాళి బండ్ పర్యాటక కేంద్రంగా మారింది. దీనికి తోడు హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువు పనులు శర వేగంగా సాగుతున్నాయి. కాజీపేట బంధం చెరువు, ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు.
గ్రేటర్ పరిధిలో 282..:
* వరంగల్ నూతన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)లో చెరువులు, కుంటల వివరాలు పొందు పరిచారు. అధికారిక లెక్కల ప్రకారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 1009, గ్రేటర్ వరంగల్ పరిధిలో 282 చెరువులు, కుంటలు ఉన్నాయని గుర్తించారు. రెవెన్యూ, భూమి, కొలతల శాఖ, సాగునీటి పారుదల శాఖ వద్ద వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది.
* మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో 50 నుంచి 60 శాతం చెరువులు, కుంటలను పునరుద్ధరించారు.
* వరంగల్-హనుమకొండ నగరాల మధ్య వారధిగా ఉన్న భద్రకాళి చెరువును హృదయ్, స్మార్ట్సిటీ పథకం ద్వారా సుమారు రూ.22.50 కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి పరిచారు. మరో రూ.62 కోట్లతో రెండో విడత పనులు జరుగుతున్నాయి. వరంగల్ పోతన రోడ్డులో 150 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* భద్రకాళి ఆలయం నుంచి కాపువాడ మత్తడి వరకు మినీ బండ్ను అభివృద్ధి పరిచారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేలా పనులు చేపట్టారు.
* హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువును ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి.
*కాజీపేట బంధం చెరువు సుందరీకరణకు నిర్ణయించి, పనులకు శంకుస్థాపన చేశారు.
* ఉర్సు రంగసముద్రం సుందరీకరణకు ప్రణాళిక సిద్ధమైంది. ఉర్సుగుట్ట, రంగలీల మైదానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు నిధులు విడుదలయ్యాయి.
వీటిపై దృష్టి పెట్టాలి
వరంగల్ జిల్లా పరిధిలోని ఖిలావరంగల్ గుండు చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, మామునూరు, గొర్రెకుంట కట్ట మల్లన్న, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, ములుగు రోడ్డు కోట చెరువులు అభివృద్ధి పరచాలి. ఆక్రమణలు తొలగించి, ఎఫ్టీఎల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించి, నీటి నిల్వ సార్థ్యం పెంచాలి.
* హనుమకొండ జిల్లా పరిధిలో హసన్పర్తి పెద్ద చెరువు, మడికొండ, కడిపికొండ, న్యూశాయంపేట కోటి చెరువు, భట్టుపల్లి చెరువులు అభివృద్ధి చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM