అభివృద్ధి.. ఆధ్యాత్మికం
ములుగు జిల్లాలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటన అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగింది.
సందడిగా సాగిన మంత్రి కేటీఆర్ పర్యటన
ఈనాడు, వరంగల్, ఈనాడు డిజిటల్,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్, ములుగు రూరల్, న్యూస్టుడే: ములుగు జిల్లాలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటన అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగింది. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉండటంతో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ సైతం పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ములుగులో మూడు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాధన డిగ్రీ కళాశాల మైదానంలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఇతర యూనిట్లను పంపిణీ చేశారు. అక్కడే సభ జరిగింది. ఇది అధికారిక సభే అయినా కేటీఆర్తో పాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేయడంతో రాజకీయ సభ తరహాలో కొనసాగింది.
కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు..
ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీతక్క ఉండడంతో వచ్చేసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ములుగులో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ చలువ వల్లే సాధ్యమైందని అన్నారు. ఒకప్పుడు మండల కేంద్రంగా ఉన్న ములుగును జిల్లా కేంద్రంగా తిర్చిదిద్ది, మున్సిపాలిటీగా ప్రకటించింది తమ ప్రభుత్వమేనని వివరించారు.
కేసీఆర్కు ప్రత్యేక అభిమానం
రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ను తొలుత తాను సిరిసిల్లలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను అడగ్గా, దాంతోపాటు మారుమూల ప్రాంతమైన ములుగులో కూడా ప్రారంభించాలని సూచించారని అన్నారు. ఆయనకు ములుగంటే ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.
ములుగు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ను సీట్లో కూర్చోబెట్టి అభినందిస్తున్నమంత్రులు
ఎవరేమన్నారంటే..
* కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ
* మేడారం జాతరను రాష్ట్ర పండగ చేసి నిధులు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. వైద్య వసతులన్నీ ములుగులోనే అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా 32 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
* కాంగ్రెస్ హయాంలో ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయి. ఇప్పుడు గిరిజనులకు ఇది స్వర్ణయుగం. ఈ రోజు రూ. 1.25 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. సుమారు రూ. 150 కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.
మంత్రి సత్యవతి రాథోడ్
* ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడ కాలుపెడితే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది నేటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉదాహరణ. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇవ్వడం కేసీఆర్ ఘనత కాదా.
ఎంపీ మాలోతు కవిత
* ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు జిల్లా ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా జిల్లా ఇచ్చారు. త్వరలోనే మల్లంపల్లిని మండలంగా చేసుకోబోతున్నాం.
జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్
తొలిసారి రామప్ప ఆలయ సందర్శన
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని తొలిసారి కేటీఆర్ సందర్శించారు. శిల్ప సౌందర్యంతో ఉట్టిపడే ఈ ఆలయాన్ని మొత్తం కేటీఆర్ ఆసక్తిగా తిలకించి విశేషాలు తెలుసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో సైతం పాల్గొన్నారు. రామప్ప చెరువు వద్దకు వెళ్లి జలదినోత్సవం సందర్భంగా గంగకు ప్రత్యేక పూజలు చేసి పూలు చల్లి, తెలంగాణ రాష్ట్రంలో జలదృశ్యం సాకారమైన తీరును గుర్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా