మధ్యాహ్న భోజనం.. కొత్త విధానానికి శ్రీకారం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు జరగనున్నాయి. పాఠశాలల్లో వంటలు చేస్తున్న ఏజెన్సీలకు ఇస్తున్న వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచిన ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.
న్యూస్టుడే, దేవరుప్పుల, భూపాలపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు జరగనున్నాయి. పాఠశాలల్లో వంటలు చేస్తున్న ఏజెన్సీలకు ఇస్తున్న వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచిన ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.
ఇకపై ఇలా..
పాఠశాలల్లో భోజనం వండి వడ్డించే ఏజెన్సీ మహిళలకు ప్రతి నెలా విద్యార్థుల సంఖ్య ఆధారంగా పౌరసరఫరాలశాఖ నుంచి సన్న బియ్యాన్ని తూకం వేసి అందించేవారు. సరకులు, కూరగాయలను మాత్రం ఏజెన్సీ మహిళలే దుకాణాల్లో కొనుగోలు చేసి వంటలు చేసేవారు. కస్తూర్బా విద్యాలయాలు, గురుకుల పాఠశాలల తరహాలో దినుసుల సరఫరాకు టెండర్లు పిలిచి, గుత్తేదారుల ద్వారా పాఠశాలలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా స్థాయిలో గుత్తేదారులను గుర్తించి వారి ద్వారా కూరగాయలు, దినుసులు, కోడి గుడ్లు తదితరాలను సరఫరా చేయనుంది. విద్యార్థులకు అందించే భోజనం మెనూలో పలు మార్పులు చేసింది. వారంలో ఏ రోజు ఏ వంట చేయాలో నిర్దేశించింది. ఈ వివరాలను పాఠశాల గోడలపై రాసి ప్రదర్శించాలని, మెనూలో తేడాలు లేకుండా చూడాలని ఆదేశించింది. విద్యార్థులకు నిర్దేశిత పరిమాణంలో ఆహారపదార్థాలు అందించాలని సూచించింది.
సాధ్యమయ్యేనా..
కేజీబీవీలు, గురుకులాల్లో 200 మందికిపైగా విద్యార్థులుంటారు. వీరికి సరకులను సరఫరా చేసే గుత్తేదారుకు కొంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10, 20కి మించి లేదు. గుత్తేదారులు వీరికి సరకులు సరఫరా చేయడం అనుకున్నంత సులభం కాదని అంటున్నారు. చాలా పాఠశాలలు దూరంగా విసిరేసినట్లున్నాయి. పప్పులు, నూనె, కూరగాయల రక్షణ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ప్రశ్న. వీటిని ఏజెన్సీ మహిళలే కొనుగోలు చేస్తే రక్షణ బాధ్యతను వారే చూసుకునేవారు. గుత్తేదారు తెచ్చిన కూరగాయల రక్షణపై ఏజెన్సీ మహిళలు అంతగా ఆసక్తి చూపరని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?