ఇంటర్ ప్రవేశాలకు వేళాయె..!
ఉన్నత విద్యకు ప్రామాణికమైన ఇంటర్మిడియట్ చదివేందుకు ప్ర£వేశాలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
జనగామ ప్రభుత్వ కళాశాలలో చేరాలంటూ ప్రచారం చేస్తున్న అధ్యాపకులు
జనగామ అర్బన్, న్యూస్టుడే: ఉన్నత విద్యకు ప్రామాణికమైన ఇంటర్మిడియట్ చదివేందుకు ప్ర£వేశాలు ప్రారంభమయ్యాయి. మే 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 30లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రవేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులకు మించరాదని స్పష్టం చేశారు. ప్రవేశాల కోసం ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్షలు నిర్వహించొద్దని, నిబంధనలకు విరుద్ధంగా చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఓ వైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, మరోవైపు ప్రభుత్వ కళాశాలలు ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు.
జిల్లాలో ఐదు వేల సీట్లు
జిల్లాలో మొత్తం ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, వృత్తివిద్యా కోర్సుల్లో సుమారు ఐదు వేల వరకు సీట్లు ఉన్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 ప్రైవేటు కళాశాలల్లో పదివేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో ప్రవేశాల వేట కొనసాగుతూనే ఉంది. గతేడాది జిల్లాలోని ఏ ప్రభుత్వ కళాశాలలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని సమాచారం. విద్యార్థుల ప్రవేశాల కోసం ఆయా కళాశాలల్లోని అధ్యాపక బృందం తమదైన శైలిలో ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ఉందని అవగాహన కల్పిస్తున్నారు. ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు గ్రామాల్లోకి వెళ్లి తమదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషిచేస్తున్నారు. గతేడాది ఫర్వాలేదనిపించినా.. ఈ ఏడాది మంచి ఫలితాలు రావడంతో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రిన్సిపాల్స్ చెబుతున్నారు.
30 తుది గడువు
ఇంటర్లో ప్రవేశం పొందాలనుకునే వారు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30 వరకు అవకాశం ఉంది. www.tsbie.gov.in వెబ్సైట్లో విద్యార్హతల వివరాలను నమోదు చేసి కళాశాలతో పాటు గ్రూపును ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం కళాశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సాంకేతిక కారణంతో అప్పుడప్పుడు ఆన్లైన్లో నమోదు ప్రక్రియలో సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, తప్పులు జరగకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేసుకోవాలని, సందేహాలుంటే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు.
నాణ్యమైన విద్య
- డీఈఐవో శ్రీనివాస్, జనగామ
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన ప్రాంగణాలు, పలు సౌకర్యాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేని విద్య అందుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నాం. ఈ ఏడాది మంచి ఫలితాలను సాధించాం. ఎక్కువ ప్రవేశాలు వస్తాయని ఆశిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం