ముంపు ముప్పు.. తప్పదు ముందస్తు మేల్కొలుపు
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కురిసినా ఏటా నగరం నీట మునుగుతోంది. ఈ ఏడాదీ ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అంతంత మాత్రంగా ఉన్నందున మంపు ముప్పు పొంచి ఉంది.
న్యూస్టుడే, కార్పొరేషన్
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కురిసినా ఏటా నగరం నీట మునుగుతోంది. ఈ ఏడాదీ ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అంతంత మాత్రంగా ఉన్నందున మంపు ముప్పు పొంచి ఉంది. ప్రధానమైన నాలాల పూడికతీత పనులతోనే సరిపెట్టారు. డివిజన్లలోని అంతర్గత డ్రైనేజీల్లో వ్యర్థాలు తొలగించలేదు. చెరువుల మత్తడి నాలాలు విస్మరించారు. వరద నీటి కాల్వల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాజీపేట, హనుమకొండ, వరంగల్తోపాటు విలీన గ్రామాల్లో ముందస్తు పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ముంపు కాలనీలు, నాలాలు, అంతర్గత డ్రైనేజీలు, ముందస్తు పనులపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
నాలాల పూడికతీత అంతంత మాత్రమే!
* కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో 33 ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. 70-80 శాతం పనులు పూర్తయ్యాయని బల్దియా ఇంజినీర్లు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది.
* కాజీపేట రామకృష్ణ కాలనీ, దర్గారోడ్, డీజిల్ కాలనీల నాలాల్లో పూడికతీత పనులు చేయాల్సి ఉంది.
* హనుమకొండ నయీంనగర్ నాలా పూడికతీత పనులు సరిగ్గా జరగలేదు. నాలుగు వెంట్సు ఉండగా కేవలం ఒకే వెంటు వద్ద పూడికతీత పనులు చేపట్టారు. పోచమ్మకుంట, భగత్సింగ్నగర్, 100 అడుగులు రోడ్డులో చేయాలి.
* వరంగల్ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, కొత్తవాడ 80 అడుగుల నాలా, ఎల్బీనగర్, అబ్బనికుంట, చింతల్, శివనగర్, ఎస్ఆర్ఆర్తోట, డీకేనగర్ నాలాల్లో వ్యర్థాలు తీయాలి.
వ్యర్థాలతో అంతర్గత డ్రైనేజీలు
* డివిజన్లలో అంతర్గత డ్రైనేజీల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్య కార్మికులతో గ్యాంగ్ వర్క్ చేయించాలని మేయర్, కమిషనర్ ఆదేశించినప్పటికీ కొన్ని డివిజన్లలో కదలిక లేదు.
* ఉర్సు, కరీమాబాద్, విద్యానగర్, శివనగర్, రంగశాయిపేట, చింతల్, అబ్బనికుంట, కాశీబుగ్గ, ఎల్బీనగర్, కొత్తవాడ, మట్టెవాడ, గిర్మాజిపేట, రామన్నపేట, రంగంపేట, హనుమకొండ మచిలీబజారు, కాకతీయ కాలనీ, రాయపురా, రెడ్డికాలనీ, బాలసముద్రం, కాకాజీ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, కనకదుర్గ కాలనీ, ఇందిరానగర్, జులైవాడ, కాజీపేటలో రామకృష్ణ కాలనీ, ప్రశాంత్నగర్, దర్గా రోడ్డు, సోమిడి, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయాలి.
ఇలా సన్నద్ధమైతే మేలు..
* నగర శివారు నుంచి వచ్చే వరదనీరు సాఫీగా వెళ్లేలా నాలాలు క్లియర్గా ఉంచాలి.
* నాలాలు, అంతర్గత డ్రైనేజీల్లో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలి
* కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రధాన రహదారుల్లో వరదనీరు నిల్వకుండా కచ్చా కాల్వలు తీయాలి.
* ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా కచ్చా కాల్వలు తీయాలి. నీరు నిలిచే దగ్గర మట్టితో నింపాలి.
* హంటర్రోడ్ బొందివాగు నాలా పరిసరా కాలనీల్లో కచ్చా కాల్వలు తీయాలి.
* హంటర్రోడ్ 12 మోరీలు, పోతనరోడ్, భద్రకాళి, అలంకార్ నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
* ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలు ఎంపిక చేయాలి.
* బల్దియాలో కంట్రోల్ రూం, ముంపు కాలనీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి.
* డీఆర్ఎఫ్, టౌన్ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలతో బృందాలు ఏర్పాటు చేయాలి.
ముంపు కాలనీలు ఎన్నో..
కాజీపేట: ప్రశాంత్నగర్, రామకృష్ణ కాలనీ, డీజిల్ కాలనీ
హనుమకొండ: అలంకార్, కాకతీయ కాలనీ, పద్మాక్షికాలనీ, విద్యానగర్, సమ్మయ్యనగర్, టీవీ టవర్ కాలనీ, అంబేడ్కర్ భవన్, ఎన్జీవోస్ కాలనీ, వికాస్నగర్
వరంగల్: రంగంపేట, సరస్వతి కాలనీ, భద్రకాళి రోడ్, కొత్తవాడ, బ్యాంకు కాలనీ, మర్రి వెంకటయ్య కాలనీ, ఎల్బీనగర్, కాశీబుగ్గ సొసైటీ కాలనీ, ఎనుమాముల మధురానగర్, సాయి కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, అబ్బనికుంట, చింతల్, శివనగర్, కాశీకుంట, ఎస్ఆర్ఆర్తోట, ఎన్టీఆర్నగర్, సాయినగర్, సంతోషిమాత కాలనీ, రామన్నపేట బీసీˆ కాలనీ, గాయత్రినగర్, పోతననగర్ కాలనీలు నీట మునుగుతున్నాయి.
వరదనీటి కాల్వ పనులు ఆలస్యం
* వరదనీటి కాల్వల నిర్మాణ పనులు నెలలు గడుస్తున్నా పూర్తవ్వడం లేదు.
* జవహర్నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు వరద నీటి కాల్వ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
* వరంగల్ పోతనరోడ్డు, సంతోషిమాత కాలనీ, శివనగర్ ప్రాంతాల్లో పనులు మధ్యలోనే ఉన్నాయి.
* ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన వరద నీటి కాల్వల పనులు మొదలు కాలేదు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట, న్యూస్టుడే: సమస్య నెలకొన్న వార్డులు: వర్ధన్నపేట మున్సిపాలిటీలో మురుగు నీరు, వర్షం నీరు వెళ్లే వ్యవస్థ సక్రమంగా లేదు. ఏడో వార్డులోని ఫిరంగిగడ్డ నుంచి కోనాపురం వెళ్లే దారిలో నీరు నిలుస్తుండడంతో.. సమీపంలోని నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ వార్డులో రోడ్డు విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉండడంతో వర్షం నీరు జాతీయ రహదారిపై నిలిచే అవకాశం ఉంది. 3, 5, 10, 11 వార్డుల్లో వర్షం నీరు, మురుగు కాల్వల ద్వారా వెళ్లలేక రోడ్లపై నిలుస్తోంది.
పరిష్కారం: పట్టణ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో పట్టణంలో వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం
[ 18-04-2024]
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. -
అందరి సంక్షేమం.. పార్టీల సంకల్పం
[ 18-04-2024]
ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం.. -
నామపత్రాలకు వేళాయె!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
లోక్సభ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ
[ 18-04-2024]
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తెలిపారు. -
ఓటరుకు ఆహ్వానం..
[ 18-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
అటవీ సంరక్షకులు..!
[ 18-04-2024]
వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు. -
దేవాదుల పంపింగ్ ఆగింది.. పంట ఎండింది..
[ 18-04-2024]
ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. -
పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?
[ 18-04-2024]
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
లోక్సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 18-04-2024]
ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
‘రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన భారాస’
[ 18-04-2024]
‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ఆరోపించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సూచించారు. -
డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!
[ 18-04-2024]
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. -
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల నరికివేత
[ 18-04-2024]
కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సివిల్స్ ర్యాంకర్లకు ఘన సత్కారం
[ 18-04-2024]
సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్ కుమారుడు మెరుగు కౌశిక్ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్ ఫెడరేషన్), ఐవీఎఫ్(ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్), ఇతర ప్రతినిధులు హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. -
చేసిన పనులకు బిల్లులివ్వకపోతే చనిపోతా..
[ 18-04-2024]
‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..