ప్రత్యామ్నాయ సాగుపై ప్రణాళికలు రూపొందించాలి
పంటల సాగు సరళి మార్పుతోనే వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డా.రావుల ఉమారెడ్డి అన్నారు.
వరంగల్ వ్యవసాయం, న్యూస్టుడే: పంటల సాగు సరళి మార్పుతోనే వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డా.రావుల ఉమారెడ్డి అన్నారు. ఇందుకు రైతులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. శుక్రవారం తెలంగాణ అగ్రిటెక్, అసోచామ్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆధునిక వ్యవసాయం, సాంకేతిక సాగు విధానాలపై ప్రదర్శన, సదస్సు జరిగింది. ప్రదర్శన కేంద్రాన్ని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి అసోచామ్ కో కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి ప్రారంభించారు. సదస్సులో డా.ఉమారెడ్డి ప్రసంగించారు.
వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి వ్యవసాయ సీజన్లను మార్చి 30లోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. పత్తి విభాగ సీనియర్ శాస్త్రవేత్త డా.రాంప్రసాద్ మాట్లాడుతూ.. పత్తి పంటకు గులాబీ పురుగు బెడద ఇప్పటికీ ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత విధానంలో సాగు చేయడం మేలని సూచించారు. సదస్సు అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, అధికారులు సమాధానాలిచ్చారు. ఈ సదస్సులో ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్రాజు, సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు రవీందర్సింగ్, ఉషాదయాళ్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా.దిలీప్కుమార్, శాస్త్రవేత్తలు డా.మధు, డా.బలరాం ఉమ్మడి వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల రైతులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన : ప్రదర్శనలో సుమారు 80 వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల పంటల విత్తనాలు, ఆధునిక పనిముట్లు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, సేంద్రియ వ్యవసాయం, సస్యరక్షణ మందుల వినియోగం, ఉద్యాన, పట్టు, వ్యవసాయ రంగంలో వినియోగించే పరికరాలు, కొత్తసాగు విధానంలో ఉపయోగించే ట్రాక్టర్లు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలు తదితరాలను ప్రదర్శించారు. ఇత్తడి, వెండి, తదితర లోహాలతో చేసిన దేవతల ప్రతిమలు, జిమ్ పరికరాలు, సోఫా సెట్లు కూడా ప్రదర్శనలో అమ్మకానికి పెట్టడం విశేషం. ఆదివారం వరకు ప్రదర్శన కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్