పశువుల సంచారం.. ప్రాణ సంకటం
భూపాలపల్లిలో జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రోడ్లపై పశువులు యథేచ్ఛగా తిరగడమే కాకుండా, వాటిపైనే సేద తీరడంతో వాహన ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి.
జవహర్ నగర్ కాలనీ సమీపంలో జాతీయ రహదారిšపై..
భూపాలపల్లి, న్యూస్టుడే: భూపాలపల్లిలో జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రోడ్లపై పశువులు యథేచ్ఛగా తిరగడమే కాకుండా, వాటిపైనే సేద తీరడంతో వాహన ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. వేగంగా వచ్చే పెద్ద పెద్ద వాహనాలు తగిలి మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. భూపాలపల్లి నుంచి గణపురం మండలం చెల్పూరు వరకు సెంట్రల్ లైటింగ్, మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో కూడా మొక్కలు పెంచడంతో వాటి నీడకు పశువులు చేరి సేద తీరుతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ నుంచి జంగేడు, కాశీంపల్లి రహదారి, అంబేడ్కర్ కూడలి నుంచి సుభాష్కాలనీ, కృష్ణాకాలనీ వరకు గల రహదారులపై పశువుల సంచారం ఉంటోంది. గుంపులు గుంపులుగా రోడ్డుపై తిరుగుతున్నాయి. కేటికే 1, 5, 6, 8వ ఇంక్లైయిన్లోని రోడ్ల పైన కూడా పశువులు తిష్టవేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
మచ్చుకు కొన్ని..
- పట్టణంలోని గణేష్ చౌక్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం పశువులు గుంపు జాతీయ రహదారిపై తిరుగుతున్న క్రమంలో అందులోని రెండు పశువులు ఒకదానిని మరొకటి పొడుచుకుంటూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.
- పట్టణంలోని సుభాష్కాలనీ ప్రాంతంలోని రామాలయం సమీపంలో రహదారిపై పశువులు సేద తీరడంతో రెండేళ్ల క్రితం ఉదయం పూట ద్విచక్ర వాహనంపై అంబేడ్కర్ కూడలి వైపు వస్తున్న సుభాష్కాలనీకి చెందిన యువకుడు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి, పశువులను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.
- పట్టణంలోని సీఆర్నగర్ కాలనీ ప్రాంతంలోని కేటికే 6వ గని రహదారి ప్రాంతంలో ఆరు నెలల క్రితం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చిన స్థానిక కాకతీయ కాలనీకి చెందిన ఓ యువకుడు పశువులను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షానికి తడిసిన రోడ్లపై నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణించాలి. అకస్మాత్తుగా బ్రేకులు వేయొద్దు. ఇలా చేస్తే చక్రాలు జారి వాహనం అదుపుతప్పే ప్రమాదం ఉంది. డూమ్ లైట్ సరిగా ఉండేలా చూసుకోవాలి. పశువులు ఉన్నట్లు గుర్తిస్తే 50 మీటర్ల ముందే వేగం తగ్గించి బ్రేకులు వేసుకోవాలి. కార్లు, ఇతర వాహనాలను డివైడర్ల పక్క నుంచే కాకుండా రహదారి మార్జిన్ సరిచూసుకుంటూ నడపాలి. వైపర్లు సరిగా పనిచేసేలా చూసుకోవాలి. వాహన బ్రేకులు కండిషన్లో ఉంచుకోవాలి. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. పశువుల పక్కన నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. లేదంటే అవి బెదిరి మీదపడే ప్రమాదం ఉంటుంది.
అధికారులు దృష్టి పెట్టాలి..
రహదారులపై పశువుల సంచారాన్ని నిలువరించేందుకు పురపాలక అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. వర్షాలు కురిసిన సమయంలో పశువులు రోడ్లపైన సంచరిస్తుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నందున రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు అధికారులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పశువులను స్థానిక బందెల దొడ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. పశువుల పెంపకందారులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత వారు వినిపించుకోకుంటే పశువులను దూరప్రాంతాల్లోని గోశాలకు తరలించారు.
పట్టణంలోని గణేష్ చౌక్ ప్రాంతంలో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
-
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ!
-
Nagarjuna sagar: సాగర్ డ్యామ్ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత
-
Ola: ఇక ఓలా యాప్లోనూ యూపీఐ చెల్లింపులు
-
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్