మామూళ్ల కోసం ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్
హనుమకొండ ప్రాంతం వడ్డేపల్లి 80 అడుగుల రోడ్డులోని ఓ అపార్టుమెంటులో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేస్తూ అర్బన్ మలేరియా తాత్కాలిక కార్మికుడ ఎర్ర రాజు ఊపిరడాక ఇటీవల మృతి చెందారు.
వడ్డేపల్లి ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో ఫాగింగ్ చేస్తున్న కార్మికుడు
కార్పొరేషన్, న్యూస్టుడే: హనుమకొండ ప్రాంతం వడ్డేపల్లి 80 అడుగుల రోడ్డులోని ఓ అపార్టుమెంటులో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేస్తూ అర్బన్ మలేరియా తాత్కాలిక కార్మికుడ ఎర్ర రాజు ఊపిరడాక ఇటీవల మృతి చెందారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్ చేయకూడదు. హనుమకొండకు చెందిన ఓ హెల్త్ ఇన్స్పెక్టర్ హుకుం జారీ చేయడంతో కార్మికుడు ఫాగింగ్కు వెళ్లినట్లు తెలిసింది. దీనిపై గ్రేటర్ వరంగల్ ఒప్పంద ఉద్యోగ, కార్మిక సంఘాల ఐకాస ప్రతినిధులు మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి విచారణ లేదు.
- నగరంలో బల్దియా అర్బన్ మలేరియా విభాగం ప్రజాసేవ మరచి ప్రైవేటు వ్యక్తుల సేవలో నిమగ్నమయింది. నిబంధనలకు విరుద్ధంగా మామూళ్ల కోసం అపార్టుమెంట్లు, స్టార్ హోటళ్లు, లాడ్జ్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫాగింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. వారానికి రెండు, మూడుసార్లు ఫాగింగ్ చేస్తే రూ.1000-1500 వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మలేరియా విభాగానికి చెందిన హెల్త్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు ఇష్జారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.
షెడ్యూల్ బేఖాతరు..
నగరంలో దోమల నివారణ ఫాగింగ్ చేసేందుకు నాలుగు పెద్ద ఆటోలు, 35 హ్యాండ్ మిషన్లు ఉన్నాయి. రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో ఫాగింగ్ చేయడం కోసం 66 డివిజన్ల వారీగా షెడ్యూల్ రూపొందిస్తారు. పెద్ద ఆటోలు వరంగల్లో 2, హనుమకొండలో 2 నడుస్తాయి. హ్యాండ్ మిషన్లు రెండు డివిజన్లకొకటి వెళ్తాయి. ఫాగింగ్ కోసం రోజుకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్రోలు, డీజిల్ కోసం గ్రేటర్ ఖర్చు చేస్తోంది. హెల్త్ ఇన్స్పెక్టర్ల, హెల్త్ అసిస్టెంటు ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేయాల్సిన సిబ్బంది షెడ్యూల్ను పక్కన పెట్టేసి ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్ చేస్తున్నారు.
- ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల ఒత్తిళ్లతో ప్రైవేటు సేవకెళ్తున్నట్లుగా తెలిసింది. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఫాగింగ్ షెడ్యూల్ పూర్తిగా దారి తప్పింది. కొందరు ఉద్యోగులు ఫాగింగ్ చేయకుండానే చేసినట్లుగా దొంగ సంతకాలు సమర్పిస్తున్నారు. నెలరోజుల క్రితం హనుమకొండలో ఉదాహరణ బయట పడింది. ఫాగింగ్ యంత్రాలకు వినియోగించాల్సిన డీజిల్, పెట్రోల్ దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కమిషనర్ ఆగ్రహం: హనుమకొండ వడ్డేపల్లిలోని అపార్టుమెంటులో ఫాగింగ్ చేసేందుకు వెళ్లిన తాత్కాలిక కార్మికుడు మృతి చెందిన ఘటనపై కమిషనర్ రిజ్వాన్ బాషా ఆరా తీశారు. హనుమకొండకు చెందిన హెల్త్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ల పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాలనీలను వదిలేసి, ప్రైవేటు భవనాల్లో ఫాగింగ్ చేయడాన్ని తప్పు పట్టారు. దీనిపై విచారణ చేపట్టాలని అదనపు కమిషనర్ను ఆదేశించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన