ర్యాగింగ్ రోగానికి చికిత్స చేద్దాం
కాకతీయ వైద్య కళాశాలలోని వైద్యులు అనేక రోగాలకు మందులిచ్చి వ్యాధులు నయం చేస్తున్నారు. క్యాంపస్లో బుసలు కొడుతున్న ర్యాగింగ్ రోగానికి మాత్రం మందు కనుగొనడం లేదు.
ఏటా కేఎంసీలో బుసలు కొడుతోంది..
ఈనాడు, వరంగల్, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: కాకతీయ వైద్య కళాశాలలోని వైద్యులు అనేక రోగాలకు మందులిచ్చి వ్యాధులు నయం చేస్తున్నారు. క్యాంపస్లో బుసలు కొడుతున్న ర్యాగింగ్ రోగానికి మాత్రం మందు కనుగొనడం లేదు. ఈ వ్యాధితో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిసి కూడా కొందరు విద్యార్థులు దీన్ని మామూలుగా తీసుకుంటున్నారు. పైగా ఈ జబ్బు ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంతో ఏటా తరగతులు ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధిలా వ్యాపిస్తోంది. చికిత్స కన్నా నివారణే మేలు అని చెప్పే వైద్యులు ర్యాగింగ్ నివారణపై మాత్రం దృష్టి సారించడం లేదు.
కొత్తగా కళాశాలల్లో ప్రవేశాలు పొందిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు మానసిక వేధింపులు, భౌతిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బాధిత జూనియర్ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడటం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం వల్ల విషయాలు బయటకు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 14న అర్ధరాత్రి కేఎంసీలో ప్రథమ సంవత్సరం విద్యార్థి రీడింగ్ రూం నుంచి వసతిగృహంలోని తన గదికి వెళ్తుండగా సీనియర్ (ద్వితీయ సంవత్సరం) విద్యార్థి అతన్ని తాగునీటి కోసం నిలువరించారు. జూనియర్ వినకుండా వెళ్లిపోవడంతో ఈ సీనియర్ జీర్ణించుకోలేకపోయారు. గదిలో నుంచి బయటకు పిలిచి భౌతికంగా దాడిచేసి గాయపర్చారు. తనపై దాడిచేసిన సీనియర్లపై జూనియర్ విద్యార్థి ఫిర్యాదుతో ఇటు పోలీసులు, అటు కళాశాల అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ర్యాగింగ్కు సహకరించిన ఆరుగురు విద్యార్థులు కళాళాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. క్షణికావేశంలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు
- విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడేవారిపై చట్టపరంగా తీసుకునే చర్యలను వివరిస్తూ సూచికలను ఏర్పాటు చేయాలి.
- తమ కళాశాలలో చేరబోయే విద్యార్థులకు అందజేసే ప్రాస్పెక్టస్లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధించామని.. ఇందుకు పాల్పడితే విద్యార్థులను కళాశాల నుంచి వేటు వేస్తామని, జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పటం వంటి కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొనాలి.
- శిక్షలో భాగంగా విద్యార్థి ఉపకార వేతనాలు, ఇతర సంక్షేమ సౌకర్యాలు నిలిపివేత, పరీక్షా ఫలితాల నిలుపుదల, వసతి గృహ బహిష్కరణ వంటి చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకుడి నుంచి తాము ర్యాగింగ్ నేరానికి పాల్పడబోమని హామీ పత్రం తీసుకోవాలి.
- ర్యాగింగ్కు గురైతే ఎవరిని సంప్రదించాలో చరవాణి నెంబరు, ఈమెయిల్ వివరాలు కళాశాలలో రాసి పెట్టాలి.
- ప్రతి కళాశాల, వసతి గృహాల్లో విద్యార్థులతో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలి.
శిక్షలు ఇలా
- తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం 1997(చట్టం 26-1997) ప్రకారం ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడినా, ప్రోత్సహించినా శిక్షార్హులు
- నేరం రుజువైతే కొంతకాలం జైలుశిక్ష, విద్యాసంస్థల నుంచి తొలగింపు.
- ర్యాగింగ్కు పాల్పడిన వారిని మరే ఇతర కళాశాలల్లో ప్రవేశాలు పొందకుండా డిబార్ చేస్తారు.
ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవం...
ఈ ఏడాది నుంచి ఏటా ఆగస్టు 12ను ర్యాగింగ్ నిషేధిత దినోత్సవంగా కళాశాలలు జరపాలని యూజీసీ కోరింది. పోలీసులు, నిపుణులను క్యాంపస్కు ఆహ్వానించి ఈ మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని వివరించాలి.
- గత మార్చిలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వరంగల్ నిట్లో ర్యాగింగ్పై అవగాహన సదస్సు జరిగింది. డీసీపీ పుష్ప పాల్గొని విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
గతంలో సంఘటనలు
- కేఎంసీలో మొదటిసారి 2009లో ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది.
- 2014లో ఇద్దరు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి ఆరునెలల పాటు బహిష్కరించారు.
- 2021లో ఉత్తరాదికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువైన విద్యార్థి బాధితుడు. కేంద్రస్థాయిలో ఒత్తిడి రావడంతో లోలోపలే దాన్ని దాచిపెట్టి సర్దుకునేలా చేశారు.
- అదే సంవత్సరం నవంబరులో మద్యం మత్తులో ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ ఓ విద్యార్థి ప్రధానితోపాటు అనేక మందికి ట్విటర్ ద్వారా ఫిర్యాదు.
- గత ఫిబ్రవరి 22న అనస్థీషియా ప్రథమ సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఎంజీఎంలో సీనియర్ పీజీ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా నిమ్స్లో చికిత్స పొందుతూ అదేనెల 26న మృతి చెందారు.
భద్రత పెంచాం
డాక్టర్ మోహన్దాసు, ప్రిన్సిపల్, కేఎంసీ
కేఎంసీలోకి ర్యాగింగ్ నివారించేందుకు సెక్యూరిటీని పెంచాం. 5 వసతిగృహాలను కలుపుతూ ప్రహరీ నిర్మించాం. రాకపోకలకు ఒకేదారి ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలకు పంపించేలా చర్యలు చేపట్టాం. ఆలిండియా కోటాలో రాజస్థాన్, తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఇక్కడి విద్యార్థులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అందరూ కలిసిపోయేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నాం.
పెత్తనం చేయడం ర్యాగింగ్
ఏవీ రంగనాథ్, సీపీ, వరంగల్
సీనియర్లు జూనియర్లపై పెత్తనం చేయడం ర్యాగింగ్ కిందకు వస్తుంది. అలాంటి ఏ ఘటనలు జరిగినా కేసులు పెడుతున్నాం. విద్యార్థులు సుహృద్భావ వాతావరణంలో ఒకరితో ఒకరు మమేకం కావాలి. తమకు ఫిర్యాదు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అనవసరంగా విద్యార్థులు భవిష్యత్తు పాడుచేసుకోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ