నారీశక్తికి వందనం..
మహిళలు సంఘటితంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. తమ సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేస్తూ ప్రగతి సాధించారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పంచసూత్రాలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు.
భీమదేవరపల్లి భరతమాత మండల సమాఖ్యకు జాతీయ గుర్తింపు
ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న సమాఖ్య మహిళలు, అధికారులు
న్యూస్టుడే, భీమదేవరపల్లి: మహిళలు సంఘటితంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. తమ సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేస్తూ ప్రగతి సాధించారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పంచసూత్రాలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు. అదే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని భరతమాత మండల సమాఖ్యను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపింది. నాబార్డు, ఏపీమాస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎస్హెచ్జీ ఫెడరేషన్) సంయుక్తంగా ఏటా అందించే జాతీయ స్థాయి పురస్కారం 2022-23కు ఎంపికైంది.
- స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకొని మహిళలు పంచసూత్రాలు నూరుశాతం పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించారు. రుణాల మంజూరు, చెల్లింపులో వందశాతం రికవరీ సాధించారు.. ప్రతి నెల గ్రామ, మండల స్థాయిలో పంచసూత్రాల అమలులో భాగంగా సమావేశాలు, క్రమశిక్షణ, పొదుపులు, రుణాల చెల్లింపులు, పుస్తక నిర్వహణ, పారదర్శకత అమలు చేయడంలో తమకు తామే సాటిగా మండల సమాఖ్య నిరూపించుకుంది. సభ్యులు ప్రతి నెల పొదుపు నిధులతోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను తీసుకొని స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. కొందరు మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేస్తూ లాభాలు గడిస్తూ ఆర్థిక ప్రగతి సాధించారు. పాఠశాల దుస్తులు, ఫినాయిల్, సర్ఫ్, పచ్చళ్లు, నార సంచుల తయారీ, ధాన్యం కొనుగోలు, మినీ డెయిరీ, రైతు ఉపకరణాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధించారు. ప్రభుత్వం రూ.26 లక్షల రాయితీలో అందించిన వ్యవసాయ పరికరాలను రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.1.40 లక్షలు సాధిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కొత్తకొండ, వంగర సంఘాలు రూ.5 లక్షలకుపైగా ఆదాయం పొందారు. సమాఖ్య పరిధిలో సామాజిక కార్యక్రమాలు గుప్పెడు బియ్యం, వరద బాధితులకు దుస్తుల అందజేత, ఆహారంతో ఆరోగ్యం, కరోనా సమయంలో మాస్కుల పంపిణీ చేపట్టి ప్రశంసలు అందుకున్నారు.
- అధికారులు, మండల సమాఖ్య పాలకవర్గ సభ్యుల సమన్వయంతో సంఘాల పటిష్టతకు చేస్తున్న సేవలకు ఈ గుర్తింపు వచ్చిందని భరతమాత మండల సమాఖ్య అధ్యక్షురాలు పోలు రజిత అన్నారు.
పురస్కారం రావడం అభినందనీయం
భీమదేవరపల్లి, న్యూస్టుడే: మహిళలు ఆర్థికాభివృద్ధితోపాటు సాధికారత సాధించాలని ఏపీడీ శ్రీనివాస్ సూచించారు. బుధవారం భీమదేవరపల్లి మండల కేంద్రంలో భారతమాత మండల సమాఖ్య 19వ వార్షిక మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాల సమష్టి కృషితో జాతీయ స్థాయి పురస్కారం రావడం అభినందనీయమన్నారు. సంఘాల అధ్యక్షులు, పాలకవర్గం మరింత బాధ్యతగా పని చేసి మహిళాభ్యున్నతికి కృషి చేయాలన్నారు. సంఘాల అధ్యక్షులు, వీఓలకు యూనిఫాం, సమావేశానికి కార్యాలయాల నిర్మాణం తదితర సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వయోజనుల ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం దేవానంద్, డీపీఎం అనిల్, ప్రకాశ్తోపాటు సీసీలు, సమాఖ్య పాలకవర్గ సభ్యులు, గ్రామైఖ్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ