కాటికెళ్లినా తప్పని పాట్లు!
చివరి మజిలీలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బంధువులు, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం శ్మశానవాటికలకు వెళ్లిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
జనగామలోని శ్మశానవాటికలో అసంపూర్తిగా కట్టడాలు
జనగామ, న్యూస్టుడే: చివరి మజిలీలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బంధువులు, కుటుంబ సభ్యుల అంత్యక్రియల కోసం శ్మశానవాటికలకు వెళ్లిన వారికి అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మృతుల ఆఖరి ప్రయాణం గౌరవంగా జరగాలన్నది అందరి ఆకాంక్ష. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. శ్మశాన వాటికల్లో తగిన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తోంది. పల్లెకో వైకుంఠధామం ఉండేలా చర్యలు చేపట్టింది. పురపాలికలు, నగరపాలికల్లో ఆదర్శ వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.కోటి చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని వైకుంఠధామాల పరిస్థితి, సదుపాయాలపై గురువారం ‘ఈనాడు’ పరిశీలన చేపట్టింది.
పట్టణాల్లో అధ్వానం
జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఉన్నాయి. కొందరు మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొందరు దహనం చేసే సంప్రదాయం ఉంది. కొందరు చెరువులు, కుంటల సమీపంలో, కొందరు సొంత వ్యవసాయ భూముల వద్ద త్యక్రియలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆరు హిందు, ఒక క్రైస్తవ, ఒక ముస్లిం, మైనార్టీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున శ్మశాన వాటికలున్నాయి. ప్రిస్టన్ విద్యాలయం వెనుక క్రైస్తవులకు నిర్దేశించిన ఆఖరి మజిలీకి రూపం లేదు. స్థలం ఆక్రమణల పాలైంది. ఉన్న కొద్ది పాటి స్థలంలో వాటిక అభివృద్ధికి రూ.10 లక్షలతో పనులు ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి..
నెహ్రూపార్కు సమీపంలోని శ్మశానవాటికలో జనగామ లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని పనులు, మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రహరీ, సీసీ రోడ్లు, దహన వేదికలను నిర్మించారు. రూ.20 లక్షలతో కరోనా సమయంలో గ్యాస్ ఆధారిత దహనవాటికను నిర్మించారు. మరో రూ.10 లక్షలను ఇతర పనులకు ఖర్చు చేసినా వాడుకలో లేవు. గతంలో నిర్మించిన స్నానఘట్టం, మూత్రశాలలు, అస్థికలను భద్రపర్చే గది నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయి. చినుకుపడితే జలమయంగా మారుతున్నాయి. రూ.కోటితో శ్రీరాంనగర్ మూలోని కుంటలో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. సుమారు రూ.50 లక్షల పని జరిగినా, రూపాయి బిల్లు రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గోరీలగడ్డ వాటిక ఇళ్ల మధ్యలో ఉందని తాళం వేశారు. ధర్మకంచ, మార్కెట్యార్డు వెనుక వైకుంఠధామాల్లో సమస్యలు ఉన్నాయి.
నీటి సౌకర్యం లేక ఇబ్బందులు
కొడకండ్లలో ట్యాంకు లేని గద్దె
కొడకండ్ల, న్యూస్టుడే: కొడకండ్ల మండలం జీబీ తండా, లక్ష్మక్కపల్లి, పాఖాల, రంగాపురంలోని వైకుంఠధామాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో ప్రజలు వారికి అనుకూలమైన స్థలాల్లో అంత్యక్రియలు కొనసాగిస్తున్నారు. చెరువుముందు తండాలోని వైకుంఠధామం చెరువు మధ్యలో ఉండడంతో దారి లేదు. కొడకండ్లలో శ్మశానవాటికను వాగు ఒడ్డున నిర్మించడంతో.. వరద ఉద్ధృతికి ప్లాస్టిక్ ట్యాంక్ కొట్టుకు పోయింది. నీటి వసతి లేకపోవడంతో పక్కనున్న వాగు నీటితోనే ప్రజలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొడకండ్ల, రామేశ్వరం, మైదం చెరువుతండా, ఏడునూతుల వైకుంఠధామాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో బోరు నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదు.
జల దిగ్బంధంలో..
మన్పహాడ్లో వర్షపు నీటిలో వైకుంఠధామం
దేవరుప్పుల రూరల్, న్యూస్టుడే: దేవరుప్పుల మండలం మన్పహాడ్కు చెందిన వైకుంఠధామాన్ని చెరువు శివారులో నిర్మించారు. చెరువు నిండిన ప్రతిసారీ వైకుంఠధామం చుట్టూ నీరు చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో యశ్వంతాపూర్ వాగులో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి వైకుంఠధామం చుట్టూ ఎత్తుగా కట్టను నిర్మిస్తే ఉపయోగంలోకి వస్తుందని గ్రామస్థులు కోరుతున్నారు.
తలుపులు లేని స్నానపు గదులు
పోచన్నపేటలో..
బచ్చన్నపేట, న్యూస్టుడే: బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో.. నారాయణపురానికి వెళ్లే రహదారిలోని శ్మశానవాటికలో స్నానాల గదులకు తలుపులు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చి మొక్కలు బాగా పెరిగాయి. అధికారులు స్నానాల గదులకు తలుపులు ఏర్పాటు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి
జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలున్నాయి. నీరు, విద్యుత్తు సదుపాయాలున్నాయి. దహన క్రియలకు అనుమతి ఉంది. ఖననం, సమాధి నిర్మాణాలకు అవకాశం లేదు. పటేల్గూడెంలో వర్షానికి దెబ్బతిన్న శ్మశానవాటిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
రంగాచారి, డీపీవో
సమస్యను ఎమ్మెల్యేకు వివరిస్తాను
జనగామలో వైకుంఠధామాల విషయంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. ఆదర్శ వైకుంఠధామం పనులు, నిధుల విడుదల విషయాలను ఎమ్మెల్యేకు వివరిస్తాను.
జమున, మున్సిపల్ ఛైర్పర్సన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం