పల్లెలు మెరవాలి.. పట్టణాలు మురవాలి
2017లో గాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ మొదలెట్టారు. ఏటా ఇది అమలవుతోంది.
అమ్మపాలెంలో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ
డోర్నకల్, న్యూస్టుడే: 2017లో గాంధీ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ మొదలెట్టారు. ఏటా ఇది అమలవుతోంది. ఈసారి కూడా దీనిని పకడ్బందీగా నిర్వహించాలని సంకల్పించి జిల్లాలో 15వ తేదీన శ్రీకారం చుట్టగా అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగనుంది. గతంలో నిర్వహించిన కార్యాచరణ ద్వారా జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 15 పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు పొందగా ఒకటి రాష్ట్ర స్థాయి పురస్కారం కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇప్పుడు పల్లెలు మెరవాలి..పట్టణాలు మురవాలనే లక్ష్యంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ప్రజలలో విస్తృతంగా తీసుకెళుతున్నారు. ర్యాలీలు, ప్రతిజ్ఞలతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ నిర్వహణలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నాటికి రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉంది.
పక్కా ప్రణాళికతోనే గుర్తింపు
స్వచ్ఛతా హీ సేవా అమల్లో భాగంగా పల్లెలు, పట్టణాలలో ప్రభుత్వం నిర్దేశించిన రహదారుల శుభ్రం, కాలువల్లో మురుగు నీరు తొలగింపు, నిత్యం చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ, ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం, కూడళ్లు గోడలపై కనువిప్పు కలిగించేలా చైతన్యం రగిల్చారు. అప్పట్లో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఫలితంగా బయ్యారం మండలంలోని కొత్తపేట పంచాయతీ రాష్ట్ర స్థాయిలో పురస్కారం పొందగా జిల్లా స్థాయిలో డోర్నకల్ మండలం-చాప్లాతండా, వెన్నారం, కురవి మండలం-కొత్తూరు(జి), కురవి, నర్సింహులపేట మండలం-రామన్నగూడెం, గూడూరు మండలం-ఏపూరు, కేసముద్రం మండలం-కేసముద్రం స్టేషన్, నెల్లికుదురు మండలం-ఆలేరు, మరిపెడ మండలం-బీచురాజిపల్లి, తండా ధర్మారం, ఎల్లంపేట, పెద్దవంగర మండలం-అవతాపురం, మహబూబాబాద్ మండలం-మల్యాల, తొర్రూరు మండలం-ఖాణాపురం, బయ్యారం మండలం-కొత్తపేట గ్రామ పంచాయతీలు అవార్డులు పొందాయి. అదే ప్రేరణతో ముందుకు సాగాలని జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది.
ప్రత్యేక కార్యాచరణ ఇది
- స్వచ్ఛత ప్రాధాన్యంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన
- విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహణ
- పుర/పంచాయతీ పాలకవర్గాలు, అధికార గణం పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యం
- శ్రమదానం చేయాలి
- ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్య కలిగించాలి
- మొక్కలు నాటి సంరక్షించుకోవాలి
- గోడలపై స్వచ్ఛత నినాదాలు రాయాలి
- ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాలి
- కంపోస్టు షెడ్డులో తడి పొడి చెత్త వేరు చేయడం, సేంద్రీయ ఎరువుగా మార్చే చర్యలు అమలు పరచాలి.
గురువారం మధ్యాహ్నం12 గంటల నాటికి ఇలా..
రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం: 08
నిర్వహించిన కార్యక్రమాలు: 1226
పాల్గొన్న ప్రజలు: 109958
పని చేసిన గంటలు: 260381
అప్లోడ్ చేసిన : 1216
(స్వచ్ఛతా హీసేవ) ఫొటోలు
జిల్లాలో..
- పురపాలికలు : 4
- గ్రామ పంచాయతీలు : 461
ప్రజల భాగస్వామ్యం భేష్
రవి, జిల్లా సమన్వయకర్త, స్వచ్ఛ భారత్ గ్రామీణ్
స్వచ్ఛతా హీ సేవలో ప్రజల భాగస్వామ్యం భేష్గా ఉంది. ర్యాలీలు, సదస్సులు, ప్రతిజ్ఞలకు ఊహించని స్పందన కనిపించింది. పురపాలికలు, పంచాయతీల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేశాం. ఏ రోజుకారోజు స్వచ్ఛతా హీ సేవపై పర్యవేక్షణ ఉంటుంది. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకు వస్తుండటం ఒక శుభ పరిణామం. గతంలో వచ్చిన అవార్డులే స్ఫూర్తిగా ముందుకు సాగుతాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు