చినుకులే దిక్కు.. పంటలెలా దక్కు!
ఈ ఏడాది జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి అన్నట్లుంది.
న్యూస్టుడే, వరంగల్ వ్యవసాయం, గీసుకొండ, చెన్నారావుపేట: ఈ ఏడాది జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి అన్నట్లుంది. రెండు విధాలా అన్నదాతకు నష్టాలు తప్పడం లేదు. వాతావరణంలో లోపించిన సమతుల్యత పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కురవాల్సిన సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ సీజన్ జులైలో సాధారణం కంటే 186 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తరవాత ఆగస్టులో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నీటి తడులు అందకపోవడంతో మొక్కలు గిడసబారాయి. పెరుగుదల లేకుండానే పత్తికి పూత, మొక్కజొన్న కాత వచ్చాయి. ఈ నెలలో అడపాదడప కురుస్తున్న వర్షాలు పంటలకు కొంతమేరకు మేలు చేస్తున్నాయి.
దెబ్బతీసిన ఆగస్టు....
ఆగస్టులో వర్షాభావ పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణం కన్నా 70 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. అలాగే ఈ నెలలో 21వ తేదీ వరకు కూడా 23 శాతం లోటు వర్షపాతమే నమోదు అయింది. వర్ధన్నపేట, ఖిలావరంగల్, గీసుకొండ, సంగెం, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.
ఎదుగుదల లోపించింది
గీసుకొండలో గిడసబారిన మొక్కజొన్న పంట
- రైతు : పాకనాటి సారయ్య, గీసుకొండ
- ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు : మొత్తం 11 ఎకరాల్లో సాగు. ఐదెకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి.
- పెట్టుబడి : పత్తి ఎకరానికి రూ.40 వేలు, మొక్కజొన్నకు రూ.30 వేలు, వరికి రూ.30 చొప్పున.
- ప్రస్తుతం పంటల పరిస్థితి: సరైన వర్షాల్లేక మొక్కజొన్న పంటలో ఎదుగుదల లోపించింది. సాధారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరగాల్సిన మొక్క కేవలం నాలుగు అడుగులే పెరిగి, కంకులు చిన్నగా ఉన్నాయి. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా.. క్వింటాళ్లు మించేపరిస్థితి లేదు. పత్తి చేలు మొదట దెబ్బతిన్నా తరవాతి వర్షాలకు కోలుకుంది.
ఎరుపు రంగు తెగులు..
ఎర్రబారిన పత్తి పంట
- బానోత్ నర్సింహ, అమృతండా (చెన్నారావుపేట)
- 1.10 ఎకరాల్లో పత్తి
- ఎకరాకు రూ.30 వేలు
- మొదట్లో వర్షాల్లేక వేసిన విత్తనాలు మొలకెత్తక నష్టం వాటిల్లింది. తరవాత భారీ వర్షాలతో మొక్కలు కొట్టుకుపోయాయి. మిగిలిన మొక్కలకు ఎరువులు వేసి బతికించుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంటలో కలుపు అధికంగా పెరిగింది. ఎర్రతెగులు సోకి ఆకులు ఎర్రబారాయి. మొక్కల ఎదుగుదల ఆగిపోయింది.
కోలుకునే పరిస్థితి లేదు..
ఉడుత రమేష్, నల్లబెల్లి
- ఐదున్నర ఎకరాల్లో పత్తి. వరుస వర్షాలతో రెండెకరాల్లో జాలు పట్టి పంట పనికి రాకుండా పోయింది.
- రూ.1 లక్ష
- గతంలో వడగండ్ల వానలతో పంట నష్టపోయారు. ఇటీవల వర్షాలు వరుసగా కురుస్తుండటంతో పొలం జాలుపట్టి పంట ఎదుగుదల లేకుండా పోయింది. మిగిలిన మూడున్నర ఎకరాల్లో మొక్కల ఎదుగుదల లేదు. దిగుబడి రాక పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. తెగుళ్లు సోకాయి.
జిల్లాలో మోస్తరు వర్షం
వరంగల్ వ్యవసాయం, న్యూస్టుడే: వరంగల్ జిల్లాలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం కూడా చల్లబడింది. గత పదిరోజుల నుంచి ఎండలతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగింది.
24 గంటల్లో మండలాల్లో కురిసిన వర్షం (మి.మీటర్లలో..)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా