దేవాలయాలకు మహర్దశ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వందలాది దేవాలయాలు మహర్దశ సంతరించుకున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ధార్మిక భవనం ప్రారంభోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తదితరులు
రంగంపేట, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వందలాది దేవాలయాలు మహర్దశ సంతరించుకున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మంత్రులు దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్ నగరంలో రూ.4.15 కోట్లతో నిర్మించిన ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సమీకృత ధార్మిక భవనాన్ని ఉదయం ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ధార్మిక భవన్లో పూజలు చేశారు. సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే సరిపడా అర్చక, ఉద్యోగులను నియమిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ యాదాద్రి ప్రాజెక్టులో పనిచేసిన అర్కిటెక్చర్లను వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయం మాడవీధుల డిజైన్లకు వినియోగించాలని సూచించారు. పాలకుర్తిలో పురాతన శివాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు సహకారం అందించాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. నూతన భవనంలో శ్రీభద్రకాళి వేద విద్యాలయానికి ఒక అంతస్తు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బొయినపల్లి వినోద్కుమార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్కుమార్, ఆర్జేసీ రామకృష్ణ్ణారావు, వరంగల్ ప్రాంతీయ ఉపకమిషనర్ శ్రీకాంతరావు, జిల్లా సహాయ కమిషనర్ రామల సునీత, ‘కుడా’ ఛైర్మన్ సుందర్రాజ్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మితో పాటు అధికారులు, ఈవోలు, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.
భద్రకాళి, రుద్రేశ్వరాలయం సందర్శన
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చీఫ్విప్ వినయ్భాస్కర్ గురువారం ఉదయం హనుమకొండ వేయిస్తంభాల ఆలయం, శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో వారికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గణపతికి పూజ చేసిన అనంతరం రుద్రేశ్వరుడికి పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
దసరా తర్వాత మేడారం జాతర పనులు
మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు పూజలు చేస్తూ..
మేడారం(తాడ్వాయి), న్యూస్టుడే: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతర పనులన్నీ దసరా పండగ తర్వాత ప్రారంభమవుతాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యావతిరాథోడ్ పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో ఛైర్మన్ సతీష్రెడ్డి, ఎస్పీ గాస్ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్వో రాహుల్జాదవ్తో కలిసి మేడారంలో పర్యటించి మహాజాతర ఏర్పాట్లపై సమీక్షలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ అతిథిగృహానికి శంకుస్థాపన చేశారు. వనదేవతలను దర్శించుకొన్నారు.
నిర్వహణ బాధ్యత కలెక్టర్దే: 2024లో జరిగే వనదేవతల మహాజాతర నిర్వహణ బాధ్యత మొత్తం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులదేనన్నారు. జాతర ఏర్పాట్లపై స్థానిక అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీరు, దేవతల దర్శనం, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరో నెలరోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని, అప్పుడు పరిపాలన మొత్తం అధికారయంత్రాంగం చేతిలో ఉంటుందన్నారు.
ఐదో జాతరను దిగ్విజయంగా నిర్వహిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత నాలుగు పర్యాయాలుగా రూ.400కోట్లు వెచ్చించి వనదేవతల జాతరను దిగ్విజయంగా నిర్వహించామని, ఈసారీ ఏ చిన్న లోపం జరగకుండా చూస్తామని మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యావతిరాథోడ్ అన్నారు. ఈసారి జాతర ఏర్పాట్లకోసం రూ.80 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖకు రూ.13.24 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.2.15 కోట్లతో అతిథిగృహం పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల హరిబాబు, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సర్పంచి చిడం బాబురావు, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..