ఓరుగల్లుకు జ్వరం
ఎవర్ని కదిలించినా నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, జ్వరాలంటున్నారు.. ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు.
కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో..
న్యూస్టుడే, ఎంజీఎం ఆసుపత్రి: ఎవర్ని కదిలించినా నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, జ్వరాలంటున్నారు.. ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. వర్షాలకు తోడు పరిసరాల పరిశుభ్రత లేమి కారణంగా పెరిగిన దోమలు వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలతోపాటు, ఎంజీఎం ఆసుపత్రికి వైద చికిత్సలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 70 మందికి పైగా జ్వరాలతో వస్తుండగా, ఎంజీఎం ఆసుపత్రికి ప్రతి రోజూ వచ్చే 3 వేలకుపైగా ఓపీల్లో 600కు పైగా జ్వరాలతో ఉంటున్నారు. ఓపీ ల్యాబులో ప్రతి రోజు 70 మందికి పైగా నమూనాలు సేకరించి పంపిస్తుండగా అందులో 7 నుంచి 10 వరకు డెంగీ పాజిటివ్ నివేదికలు వస్తున్నట్లు ఎంజీఎం అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రిలో చేరి జ్వరంతో చికిత్స పొందుతున్న వారి నుంచి ప్రతి రోజు 50 మంది రోగుల శాంపిల్స్ సేకరిస్తే కనీసం ఏడుగురికి డెంగీ పాజిటివ్ నివేదికలు వస్తున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో 200పైగా జ్వర బాధితులు ఉన్నారు.
నగరంలో 72 డెంగీ కేసులు
కార్పొరేషన్, న్యూస్టుడే: వరంగల్ నగరంలో డెంగీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 72 డెంగీ, 5 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో 15-20 మంది పిల్లలు ఉన్నారు. వైరల్ జ్వరాలు ఇంటింటా ఉన్నాయి. ఆరెపల్లి, హసన్పర్తి, భీమారం, గోపాల్పూర్, కడిపికొండ రాజీవ్ గృహకల్ప, తిమ్మాపూర్, మామునూరు, బొల్లికుంట, గొర్రెకుంట తదితర విలీన గ్రామాలు, వరంగల్ ప్రాంతంలో దేశాయిపేట, కాశీబుగ్గ, చింతల్, ఖిలావరంగల్, రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్, ఎన్టీఆర్నగర్, రామన్నపేట తదితర ప్రాంతాల్లో డెంగీ, మలేరియా కేసులు వెలుగు చూశాయి.
బల్దియా అప్రమత్తం
నగరంలో డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో బల్దియా అర్బన్ మలేరియా విభాగం అప్రమత్తమైంది. డెంగీ పాజిటివ్ కేసు నమోదైన ఇంటి వదంద దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నారు. కాలనీల్లో దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. యాంటీ లార్వాలో భాగంగా ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ విసురుతున్నారు. ఎంఎల్వో ఆయిల్ చల్లుతున్నారు. సాయంత్రం వేళ ఫాగింగ్ చేస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
-డాక్టర్ మధుసూదన్, జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి, వరంగల్
ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీరు నాలుగైదు రోజులు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయని గుర్తించాలి. మురుగు కాలువల్లో నీరు ఎప్పుడూ పారే విధంగా చూడాలి. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా వాడిన డీజిల్ ఆయిల్ చల్లాలి. ఇంట్లో ఇంటి చుట్టూ పనికిరాని పాత కూలర్లు, టైర్లు, డ్రమ్ములు, రోళ్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, సీసాలు లేకుండా చూసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంకులపై మూతలు ఉంచాలి. దోమలు కుట్టకుండా కిటికీలకు బయట తలుపులకు దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగత రక్షణకు దోమతెరలు, కాయిల్స్ వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నిద్రించేటప్పుడు దోమ తెరలు ఉపయోగించాలి.
జ్వరమనిపిస్తే పరీక్షలు తప్పనిసరి
డాక్టర్ సమ్మయ్య, జనరల్ మెడిసిన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీఎం ఆసుపత్రి
ఐదు రోజులైనా జ్వరం తగ్గడం లేదనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని సంప్రదించాలి. డెంగీ లక్షణాలున్న వారు సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎంజీఎం ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్ష(ఎలీసా), మలేరియా పరీక్ష చేయించుకోవాలి. లక్షణాల ఆధారంగా రక్త నమూనాలు పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తారు. పోషకాహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగవుతుంది.
ఒక రోజుకే రూ.10 వేలు ఖర్చు
ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో డెంగీ చికిత్స పొందుతున్న ఈ బాలుడు ఇస్లావత్ గణేశ్. నల్లబెల్లి మండలం గోవిందాపురం శివారు లైన్తండ నివాసి. నర్సంపేటలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆరు రోజుల క్రితం డెంగీ వ్యాధి సోకడంతో వార్డెన్ తల్లికి సమాచారం ఇవ్వగానే వచ్చి బాలుడిని మొదట ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించింది. మందులు వాడినా తగ్గక పోవడంతో మరుసటి రోజు నర్సంపేటలోని ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో చేర్పిస్తే ఒక రోజుకు రూ.10 వేలు ఖర్చు అయింది వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటివ్ వచ్చిందని నయం కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆరు రోజుల కిందట ఎంజీఎంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రక్త కణాల సంఖ్య పెరగడం లేదని డాక్టర్లు అంటున్నారని తల్లి కన్నీటిపర్యంతమైంది.
న్యూస్టుడే, నర్సంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగామలో అస్తవ్యస్త ట్రాఫిక్తో అవస్థలు..!!
[ 07-12-2023]
జనగామ పట్టణం గతంలో మున్సిపల్ కేంద్రంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంటూ ఏడేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తరుణంలో పెరిగిన పట్టణీకరణ, ట్రాఫిక్తో నిత్యం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. -
మిగ్జాం.. రైతు గుండెకు గాయం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికందే పంట నీటిపాలవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పంటలను సాగుచేసిన రైతులకు, పంట చేతికి అందే సమయంలో ప్రకృతి కక్ష కట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
నీట ముంచిన ‘మిగ్జాం’
[ 07-12-2023]
అన్నదాతకు ప్రకృతి విపత్తుతో ముప్పు వాటిల్లుతోంది.. మిగ్జాం తుపాను రైతన్నలను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షానికి పలుచోట్ల పంటలు తడిసిపోయాయి. పదిహేను రోజుల నుంచి వరికోతలు ప్రారంభమయ్యాయి. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం..!
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతుల గుండెల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో, కల్లాలో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు మిర్చి తోటలు నేలవాలాయి. -
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు పర్యటించారు. జిల్లా పౌరసరపరాలశాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అరవింద్రెడ్డి, ఎంపీడీవో బాబూ, తహసీల్దారు సమ్మయ్యలు బుధవారం పెంకవాగు లోలెవల్ చప్టా, -
అదిగదిగో మరో పోరు!!
[ 07-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపు నీదా.. నాదా అన్నట్టుగా కదిలాయి.. చివరకు కాంగ్రెస్ పై ‘చేయి’ సాధించింది. ఉమ్మడి వరంగల్లోని డజను స్థానాల్లో ఏకంగా పది తన ఖాతాలో వేసుకొంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారాస కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. -
‘మిగ్జాం’తో అన్నదాత విలవిల
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి వరంగల్ జిల్లాలో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. భారీ వర్షాలు లేకపోయినా ఎడతెరిపి లేని జల్లులతో పంటలు దెబ్బతింటున్నాయి. కోతకోసి నూర్పిడి చేసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థ పడుతున్నారు. చేలల్లో ఉన్న పంట నేలకొరిగింది. -
అక్కడ ఓట్లు ఎలా వచ్చాయంటే
[ 07-12-2023]
శాసనసభ ఎన్నికల మహాక్రతువు ముగిసింది. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలెవరో తేలిపోయింది. ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజం. ప్రజలు ఆదరించినవారు విజేతలుగా నిలుస్తారు. ఈ క్రమంలో అభ్యర్థుల స్వగ్రామాల్లో ఎవరికి ఓట్లు పడ్డాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. -
చలిపోటు.. గుండెకు చేటు!
[ 07-12-2023]
జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి(55) ఈనెల నాలుగో తేదీన గుండెపోటుతో మృతి చెందారు. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి మధ్యాహ్నం స్టేషన్ఘన్పూర్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలోని తన ఇంటికి వచ్చి ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెబుతూనే స్పృహ కోల్పోయారు. -
నేటి నుంచి ఎల్బీ కళాశాల స్వర్ణోత్సవాలు
[ 07-12-2023]
ఉత్తర తెలంగాణలో గ్రామీణ, పేద విద్యార్థులకు ఉన్నత చదువులందించిన వరంగల్ లాల్బహదూర్ కళాశాలల స్థాపించి 53 ఏళ్లు పూర్తయింది. కరోనా కారణంగా వాయిదా పడిన స్వర్ణోత్సవాలను ఈ నెల 7 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. -
అకాల వర్షం..అపార నష్టం
[ 07-12-2023]
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాలవర్షంతో నష్టాన్ని మిగిల్చిందని రైతన్నల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ‘మిగ్జాం’ తుపాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. -
సమరానికి సై
[ 07-12-2023]
సింగరేణి గుర్తింపు ఎన్నికలకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాయి. మొన్నటివరకు శాసనసభ ఎన్నికలతో రాష్ట్రమంతా సుమారు నెల రోజులు పైగా సందడి నెలకొంది. -
యూడైస్లో నమోదైతేనే సౌకర్యాలు
[ 07-12-2023]
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సమగ్ర వివరాలు ఇక నుంచి ఒకే చోట ఉండనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి యూడైస్ ప్లస్ ( యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)ను పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు