ఆరాటమే.. పోరాటమేది?
సింగరేణి కార్మిక సంఘాలు తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. కార్మికుల సమస్యలను నోటిమాటగా ప్రస్తావిస్తున్నాయి.
న్యూస్టుడే, కోల్బెల్ట్: సింగరేణి కార్మిక సంఘాలు తమ ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. కార్మికుల సమస్యలను నోటిమాటగా ప్రస్తావిస్తున్నాయి. పైపై మాటలతో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. కనీసం ఒప్పందం జరిగిన అంశాలను కూడా అమలు చేయించలేకపోతున్న సంఘాల తీరుతో కార్మికుల్లో చులకన భావన కలుగుతోంది. జేబీసీసీఐ పరిధిలో అన్ని హక్కులు, ప్రయోజనాలు అమలవుతున్నా సింగరేణిలో మాత్రం కొన్నింటిని వర్తింపజేయడం లేదు. దీనిపై నిలదీసి అమలు చేయించాల్సిన సంఘాల ఉదాసీనత కార్మికుల్లో అసంతృప్తి కలిగిస్తోంది.
గ్రాట్యుటీపై రాని స్పష్టత
గ్రాట్యుటీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో సమయం నుంచి అమలు కావాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రూ.10 లక్షలు ఉన్న గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచారు. దీన్ని 2017 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు. కార్మికులకు 2016 జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జేబీసీసీఐ స్టాండరైజేషన్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. కానీ, అమలు చేయించేందుకు నాయకత్వం పట్టుపట్టడం లేదు. 2016 జనవరిలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.20 లక్షలు వర్తింపజేయాలి.. ఏడాది కాలం నష్టపోతుండటంతో సుమారు 3000 మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యుటీ వర్తించకుండా పోయింది. దీనిపై సరైన కార్యాచరణ.. యాజమాన్యాలపై ఒత్తిడి తేవాల్సిన సంఘాలు మొక్కుబడి తీరుతో అమలుకు నోచుకోవడం లేదు.
24 ఏళ్లుగా ఒకేరకమైన పింఛను
బొగ్గు గని కార్మికుల పింఛను 24 ఏళ్లుగా ఎలాంటి సవరణ లేకుండా ఒకేలా అమలవుతోంది. 1998లో పింఛను పథకం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి సవరించుకోవాలన్న అంగీకారం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పింఛను సవరించలేదు. దీంతో చాలా మంది విశ్రాంత కార్మికులకు కేవలం రూ.300 పింఛను వస్తోంది. దీనిపై విశ్రాంత కార్మికులు ఆందోళన చేస్తున్నారు. సీఎంపీఎఫ్ ట్రస్టు బోర్డులో నిలదీసి పింఛను పథకం సవరించేందుకు కార్మిక సంఘాలు పట్టుబట్టడం లేదు.
ప్రయోజనాలపై పన్ను భారం
కార్మికులకు చెల్లించే వివిధ ప్రయోజనాలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కోల్ఇండియాలో 2013 జనవరి 1 నుంచి అమలవుతోంది. సింగరేణిలో స్థానికంగా అమలు చేయించుకోవాల్సిన కార్మిక సంఘాలు కేవలం మాటలతోనే సరిపెడుతున్నాయి. గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చించి అమలు చేయించలేకపోయింది. ఒక్కో కార్మికునికి రూ.25 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయపు పన్ను భారం పడుతోంది. దీన్ని అమలు చేయించాల్సిన కార్మిక సంఘాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
దీర్ఘకాలిక సమస్యలివీ..
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. సొంతింటి కల నెరవేరడం లేదు. ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలన్న డిమాండ్ అమలుకు నోచుకోవడం లేదు. గనులపై అధికారుల వేధింపులు, పని స్థలాల్లో రక్షణ చర్యలపై నిర్లక్ష్యం.. కనీసం పరికరాలు కూడా సక్రమంగా సరఫరా చేయని తీరు.. బినామీ పేర్ల మార్పు చేయాలన్న ఒప్పందాన్ని అమలు చేయించలేని నిస్సహాయ స్థితి.. అనేక సమస్యలు కార్మికులను చుట్టిముట్టి వేధిస్తున్నా పరిష్కారానికి చిత్తశుద్ధితో చొరవ చూపని సంఘాలు పట్టు కోసం మాత్రం కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
[ 29-11-2023]
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం సాయంత్రం సందర్శించారు. -
ఓరుగల్లుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా!
[ 29-11-2023]
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు ఓరుగల్లు గులాబీ మయమైంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థులు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్ల విజయం కోసం సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు రెండు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం
[ 29-11-2023]
ఈ నెల 30న శాసనసభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సన్నద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5గంటలతో నిర్దేశించిన ఎన్నికల ప్రచార సమయం ముగిసిందన్నారు. -
అభ్యర్థుల ఓటెక్కడ!
[ 29-11-2023]
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు ఊరూరా.. వాడవాడలా తిరిగి ప్రచారాలు చేశారు. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెరపడింది. మైకులు మూగబోయాయి. మీ ఓటు నాకే వేయండి.. -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
[ 29-11-2023]
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు పాతర వేసి విముక్తి పొందాలని చూస్తున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నర్సంపేటలో భాజపా అభ్యర్థి కంభంపాటి పుల్లారావుకు మద్దతుగా అయ్యప్పస్వామి ఆలయం నుంచి చేపట్టిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 29-11-2023]
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ అధికారులకు ఓ సవాల్. ఇక్కడ అత్యధికంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండటం.. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. -
మంగళవారం.. సాయంత్రం 5 గంటలు.. ప్రచారం ఎవరెక్కడ ముగించారంటే..
[ 29-11-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజైన మంగళవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించారు. ములుగు, భూపాలపల్లిలో 4 గంటలకే ప్రచారం గడువు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. -
ప్రచార హోరు ముగిసింది...!
[ 29-11-2023]
ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. -
‘దేశంలో కాంగ్రెస్కే గ్యారంటీ లేదు’
[ 29-11-2023]
దేశంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సాధ్వి నిరంజన్జ్యోతి పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి రావు పద్మ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సమర్థంగా నిర్వహిస్తాం
[ 29-11-2023]
జిల్లాలో ఈనెల 30న జరిగే సాధారణ ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
[ 29-11-2023]
మూడు దశాబ్దాలు అధికారం ఉన్నా.. లేకున్నా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తనను గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ భారాస అభ్యర్థి కడియం శ్రీహరి కోరారు. -
నేర వార్తలు
[ 29-11-2023]
నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కింద పడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం మహేశ్వరానికి చెందిన జర్పుల మోత్యా(64) ఆర్టీ సీలో కంట్రోలర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. -
నగరాలకు దీటుగా అభివృద్ధి చేశా..!
[ 29-11-2023]
రాష్ట్రంలో ప్రధాన నగరాలకు దీటుగా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరింత ప్రగతి కోసం ఎన్నుకునే ప్రజాప్రతినిధే కీలకమని భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
‘అవినీతి పాలకులను తరిమికొట్టాలి’
[ 29-11-2023]
అవినీతిలో కూరుకుపోయిన భారాస పాలకులను తరిమికొట్టే సమయం వచ్చిందని కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక కమిటీ ముఖ్య సమన్వయకర్త విజయశాంతి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు మద్దతుగా నిర్వహించిన విజయభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మరింత అభివృద్ధి
[ 29-11-2023]
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి లేగ రామ్మోహన్రెడ్డిని గెలిపించాలంటూ మంగళవారం తొర్రూరు... -
‘కుటుంబ సభ్యులకంటే కార్యకర్తలే నాకు ముఖ్యం’
[ 29-11-2023]
కార్యకర్తలే తనకు ముఖ్యమని, వారిచ్చిన బలంతోనే 67 ఏళ్ల వయస్సులో కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న మచ్చ లేకుండా ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నానని మంత్రి, పాలకుర్తి భారాస అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
ఆదరిస్తే ఐదేళ్లు మరింత అభివృద్ధి చేస్తా
[ 29-11-2023]
రాజకీయాల్లోకి రాకముందే తమ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేసిందని, ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రానున్న ఐదేళ్లు మరింత అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ పాలకుర్తి అభ్యర్థి యశస్వినిరెడ్డి అన్నారు. -
భారాసతో అన్ని వర్గాలకు భరోసా
[ 29-11-2023]
ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాకు చిరునామా అని భారాస ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం ఆమె ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల హరిబాబు, ఎన్నికల ఇన్ఛార్జి సాంబారి సమ్మారావు, మండలాధ్యక్షుడు సూరపనేని సాయికుమార్తో కలిసి గోవిందరావుపేట గ్రామంలోని తారకరామా కాలనీలో విస్తృతంగా ప్రచారం చేశారు. -
బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోండి
[ 29-11-2023]
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు వేయొచ్చన్నారు. -
పోల్ చిట్టీలను ప్రచారానికి వాడితే చర్యలు
[ 29-11-2023]
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం పోల్ చిట్టీలను ఓటర్లకు పంపిణీ చేస్తుందని, ఎవరైనా పార్టీ గుర్తులతో సొంతంగా పంపిణీ చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ హెచ్చరించారు. -
‘రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే’
[ 29-11-2023]
ఎమ్మెల్యేగా ఏటూరునాగారం ఆర్టీసీ బస్ డిపోను నేనే ప్రారంభిస్తానని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఏటూరునాగారంలో నిర్వహించిన రోడ్షోలో ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క స్పష్టం చేశారు. -
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటే..
[ 29-11-2023]
ఎన్నికల ప్రచారంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తింపు మంజూరు చేస్తుంది. ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాలుగు రాష్ట్రాల్లోని ఓట్లలో నాలుగు శాతం ఓట్లు వస్తే జాతీయ పార్టీగా -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
[ 29-11-2023]
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పోలీసు శాఖ పరంగా ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్కిషోర్ తెలిపారు. మంగళవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛయుత వాతావారణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
-
Bullet train: తొలి బుల్లెట్ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!
-
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్దీప్ హుడా.. వధువు ఎవరంటే?
-
Ts Elections: మాకు డబ్బులివ్వరా?.. మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు