పల్లె తోవ.. స్వచ్ఛతా హీ సేవ!
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.
పారిశుద్ధ్య పనులు చేపడుతున్న పంచాయతీ కార్మికులు
న్యూస్టుడే, చెల్పూర్(భూపాలపల్లి రూరల్): దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మించి పల్లెలు పారిశుద్ధ్యంలో మెరిసేలా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా 18 రోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన కార్యక్రమం అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే రోజుకో కార్యక్రమం చొప్పున 18 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు, అవగాహన కార్యక్రమాలు తదితర వాటిని నిర్వహించనున్నారు.
వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 18 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యంగా వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రణాళిక తయారు చేశారు. 18 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, తదితర వాటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చెత్తాచెదారంతో పేరుకుపోయిన మురుగు కాల్వలను శుభ్రం చేయించడం, తడి, పొడి చెత్తను వేరుగా చేసి సేంద్రియ ఎరువుగా తయారు చేయడం, ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించి వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవడం, శ్రమదానం, మొక్కల సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, ప్రాముఖ్యతపై విద్యార్థులకు క్విజ్, ప్లాంటేషన్ డ్రైవ్, స్వచ్ఛ ప్రార్థన, స్వచ్ఛతా రన్ నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రణాళిక ప్రకారం అమలు
- వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థంగా నిర్వహించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా 18 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Tata Tech: టాటా టెక్ అదుర్స్.. లిస్టింగ్ డే గెయిన్స్లో టాప్-7లోకి
-
Revanth Reddy: కాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా సమావేశం
-
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!