నిమజ్జన వేడుకలు.. కారాదు విషాదాంతం
స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో గతేడాది నెలకొల్పిన వినాయక మండపంలో అపశ్రుతి చోటు చేసుకుంది.
నెల్లుట్ల చెరువులో విగ్రహాల నిమజ్జనం (పాత చిత్రం)
‘స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో గతేడాది నెలకొల్పిన వినాయక మండపంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షం కురుసున్న సమయంలో పుంజూరి శివ అనే యువకుడు గణపతి మండపం వద్ద ఇనుప స్టాండ్ వేసుకొని విద్యుత్తు బల్బు అమర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు’
జనగామ టౌన్, న్యూస్టుడే: జిల్లాలో ఏటా వాడ వాడలా గణపతి మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా గణనాథులకు ఘనంగా పూజలు చేస్తారు. అనంతరం లంబోదరుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులు, కుంటలు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ వేడుకల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మండపాలను ఏర్పాటు చేసి ఏకదంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. గణేష్ మండపాల నుంచి విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనోత్సవం వరకు జరిగే ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చని పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సూచిస్తున్నారు.
ప్రమాదాలు ఇలా..
నవరాత్రి ఉత్సవాల్లో ఏటా ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గణేశ్ మండపాలకు విద్యుత్తు కనెక్షన్ తీసుకునేటప్పుడు, అలంకరణ దీపాలను అమర్చే సమయంలో విద్యుదాఘాతంతో మృత్యువాత పడుతున్నారు. అస్తవ్యస్తంగా వేలాడే తీగలతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనానికి నిర్వహించే ఊరేగింపులోనూ అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిష్ఠించిన భారీ గణపతి విగ్రహాలను వాహనాలపై తీసుకెళ్లే క్రమంలో పైన ఉండే విద్యుత్తు తీగలను తాకడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలపై ఉన్న వారు ప్రమాదవశాత్తూ వాహనాల చక్రాల కింద పడి మరణించిన సంఘటనలు ఉన్నాయి. విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో చెరువుల వద్ద లోతును అంచనా వేయకుండా యువకులు లోపలికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈత వచ్చిన వారు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు నిమజ్జన వేడుకలో అధికారుల సూచనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.
నిమజ్జన ఏర్పాట్లపై దృష్టి
జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాల వద్ద విద్యుత్తు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే విద్యుత్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వాహకులకు సూచనలు అందించారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద రక్షణ కంచెలు, తాళ్లను అమర్చుతున్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ విగ్రహాలను నీటిలోకి తీసుకెళ్లేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం జరిగే రోజు ఊరేగింపులతో పాటు చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను జనగామ శివారులోని నెల్లుట్ల చెరువులో నిమజ్జనం చేయనున్నారు. స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ పోలీస్, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం
- పి.సీతారాం, వెస్ట్జోన్ డీసీపీ
జిల్లాలో ఈ నెల 26, 27 తేదీల్లో గణపతి విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహిస్తాం. చెరువుల వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి నిర్వాహకులకు సూచనలు అందించాం. ఈ నెల 28న మిలాద్-ఉన్నబీ పర్వదినం ఉండగా అక్టోబర్ 1న నిర్వహించుకునేలా ముస్లిం సోదరులకు సూచించాం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోగా నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!