logo

AP News: గొడుగే యమపాశమై..

పొలానికి వెళ్తున్న యువకుడిని విద్యుత్తు తీగలు కబళించాయి. అతని చేతిలోని గొడుగును తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు...టి.నరసాపురం మండలం మర్రిగూడెం పంచాయతీ

Updated : 13 Jul 2021 08:49 IST

విద్యుదాఘాతంతో వాలంటీరు మృతి

శివ (పాతచిత్రం)

టి.నరసాపురం, న్యూస్‌టుడే : పొలానికి వెళ్తున్న యువకుడిని విద్యుత్తు తీగలు కబళించాయి. అతని చేతిలోని గొడుగును తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు...టి.నరసాపురం మండలం మర్రిగూడెం పంచాయతీ సున్నపురాళ్లపల్లికి చెందిన మొడియం శివ (28) గ్రామ వాలంటీరుగా పని చేస్తున్నారు. సోమవారం పొలంలో వరి నారుమడి చూసేందుకు గొడుగు వేసుకుని, ఒక రైతుకు చెందిన ఆయిల్‌పాం తోట మీదుగా వెళ్తుండగా...గొడుగు చివరి కొన హెచ్‌టీ విద్యుత్తు తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి తల్లిదండ్రులు, ఒక సోదరి (దివ్యాంగురాలు) ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి బుచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా కోసం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని