కదిలిన యంత్రాంగం..కానరాని పరిష్కారం !
కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఏర్పాటైన వైద్యశిబిరం నాలుగోరోజు కొనసాగింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. సోమవారం జేసీ హిమాన్షుశుక్లా డీఎంహెచ్వో భానూనాయక్, డీఈవో రేణుక,
బోడిగూడెంలో నాలుగోరోజూ 4 కేసులు
ఇంటింటా జ్వరసర్వే నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఏర్పాటైన వైద్యశిబిరం నాలుగోరోజు కొనసాగింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. సోమవారం జేసీ హిమాన్షుశుక్లా డీఎంహెచ్వో భానూనాయక్, డీఈవో రేణుక, డీసీహెచ్ఎస్ మోహన్చ డీపీవో రమేష్ బాబు, ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డిప్యూటీడీఎంహెచ్వో మురళీకృష్ణ తదితరులు గ్రామంలో పర్యటించారు. స్థానిక జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. జేసీ అధికారులతో సమీక్షించారు. కొయ్యలగూడెంలో ఆరోగ్య కేంద్రం, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. మరోవైపు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నప్పటికీ జ్వరాల సమస్యకు పరిష్కారం తేల్చకపోవడంపై గ్రామస్థులు పెదవి విరుస్తున్నారు.
మరో నాలుగు జ్వరం కేసులు: శిబిరంలో సోమవారం మరో నాలుగు జ్వరం కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురు బాలలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. వీరిలో విద్యార్థి చిడిపి సందీప్ కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతుండగా అయిదేళ్ల సంసాని తేజస్వినిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక బాలికతోపాటు రెండు రోజులుగా నమోదైన మరికొందరు జ్వరపీడితులు స్వల్ప లక్షణాలతో ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు.
405కు చేరిన నమూనాలు: జ్వరనిర్థరణ పరీక్షల కోసం సోమవారం నాటికి 405 రక్తనమూనాలను సేకరించారు. వీటిలో ఈ నెల 4న 62 మందికి సంబంధించి నెగెటివ్ ఫలితం వచ్చిందని జేసీ ప్రకటించగా మిగిలిన 300పైబడి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే కొందరు తలనొప్పి, జలుబు, తదితర స్వల్పసమస్యలతో బాధపడుతూ శిబిరంలో చికిత్స పొందగా జ్వర నిర్ధరణకు రక్తపరీక్షల ఫలితాలకు వేచి ఉండక తప్పనిపరిస్థితి. దీంతో అసలు జ్వరాల సమస్యకు కారణమేమిటో తేల్చడంలో జాప్యం జరుగుతోందంటూ గ్రామస్థుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
వదంతులు నమ్మవద్దు: ఆళ్ల నాని
ఏలూరు టూటౌన్: బోడిగూడెంలో విద్యార్థుల అస్వస్థతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఓ ప్రకటనలో కోరారు. ఆ గ్రామంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామని, రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని తెలిపారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలే కారణం : జేసీ
చికిత్స పొందుతున్న బాలిక తల్లితో మాట్లాడుతున్న హిమాన్షుశుక్లా
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: నలుగురు విద్యార్థుల మృతికి జ్వరాలు కారణం కాదని జాయింట్ కలెక్టరు హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలే కారణమన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4న మెంటి మధు దీర్ఘకాలికంగా కేన్సర్తో, గత నెల 26న ప్రశాంత్ మెనింజైటిస్తో, 25న జక్కు శ్రీను దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో మరణించారన్నారు. విద్యార్థులకు మాత్రమే జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. సమాధానంగా జడ్పీ హైస్కూలు నుంచి నీరు, బియ్యం, పప్పు, గుడ్లు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. నవంబరు 25న మరణం సంభవించిన నాటి నుంచి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన 50మంది విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.