AP News: సిద్ధాంతి వేషధారణలో వచ్చి.. బిచ్చమెత్తుకుంటూ..
ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ వ్యక్తి కారులో వచ్చి బిచ్చమెత్తడం..ఆయన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..ఓ అజ్ఞాత వ్యక్తి వెంకటకృష్ణాపురంలో మంగళవారం
బిచ్చమెత్తుకుంటున్న అజ్ఞాత వ్యక్తి
ద్వారకాతిరుమల, న్యూస్టుడే: ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ వ్యక్తి కారులో వచ్చి బిచ్చమెత్తడం..ఆయన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..ఓ అజ్ఞాత వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా వెంకటకృష్ణాపురంలో మంగళవారం చిలుకూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి బిచ్చమెయ్యాలని అడిగాడు. రాధాకృష్ణ భార్య సునీత బియ్యం తీసుకెళితే చెంచాతో మాత్రమే తీసుకున్నాడు. అనుమానం వచ్చిన ఆమె తన భర్తకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. దీనిని గమనించిన ఆ వ్యక్తి కారెక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాధాకృష్ణ నిలదీయగా.. అన్నవరం సిద్ధాంతినని 11 ఇళ్లలో బియ్యం సేకరించి షిర్డీ వెళ్లి గోవులకు వండి దాణాగా అందిస్తానని చెప్పాడు. ఆ తరువాత కారులో ఉడాయించాడు. తిమ్మాపురంలో గత వారం ఇదే తరహాలో జి.గాంధీ ఇంటికి వెళ్లి అతని కుమారుడికి ప్రాణగండం ఉందని శాంతి జరిపించాలని మభ్యపెట్టి రూ.16500 దండుకున్నాడు. ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. వెంకటకృష్ణాపురంలో ఈ వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని గాంధీ ఫోన్ చేస్తే తాను హైదరాబాద్లో ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశాడు.
ఉపయోగించిన కారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా