logo

Missing: రెండ్రోజుల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం

రెండ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమయ్యాడు. ఎస్సార్‌నగర్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయగూడేనికి చెందిన సత్యనారాయణ గుప్తా అలియాస్‌

Updated : 16 Dec 2021 09:53 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రెండ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమయ్యాడు. ఎస్సార్‌నగర్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయగూడేనికి చెందిన సత్యనారాయణ గుప్తా అలియాస్‌ నాని(30) నగరంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నాడు. అతనికి ఈనెల 17న వివాహం జరగాల్సి ఉంది. 13న రాత్రి 9.30 గంటలకు తన సోదరుడు ఎస్వీ బాపిరాజుకు ఫోన్‌ చేసి తాను గ్రామానికి వస్తున్నానని చెప్పాడు. అతను గ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు నగరానికి వచ్చి ఆరా తీశారు. 13న రాత్రి కేపీహెచ్‌బీ కాలనీలో బస్సు ఎక్కిన అతను ఎస్సార్‌నగర్‌లో బస్సు దిగిపోయినట్లు గుర్తించారు. అతని జాడ కోసం అంతటా గాలించి ఆచూకీ లేకపోవడంతో బుధవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని