బరితెగింపు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా పందెంరాయుళ్ల పంతమే గెలిచింది. శుక్రవారం ఉదయం కొద్దిసేపు వేచిచూసిన వారంతా ఎక్కడికక్కడే బరులను సిద్ధం చేశారు. నిమిషాల్లో వేలాది మంది చేరిపోయారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి పందేలను సాగించారు. వాటి మాటున గుండాట, కోతాట తదితర జూదాలను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారాయి.
జిల్లావ్యాప్తంగా కాలు దువ్విన కోళ్లు
చేతులు మారిన రూ. కోట్లు
గుండుగొలనులో తలపడుతున్న కోళ్లు
భీమవరం పట్టణం, జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా పందెంరాయుళ్ల పంతమే గెలిచింది. శుక్రవారం ఉదయం కొద్దిసేపు వేచిచూసిన వారంతా ఎక్కడికక్కడే బరులను సిద్ధం చేశారు. నిమిషాల్లో వేలాది మంది చేరిపోయారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి పందేలను సాగించారు. వాటి మాటున గుండాట, కోతాట తదితర జూదాలను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారాయి.
వర్షం కురుస్తున్నా.. ఓవైపు వర్షం కురుస్తున్నా నిర్వాహకులు ఏర్పాట్లలో ఏమాత్రం తగ్గలేదు. ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పందేల జోరు కొనసాగింది. మూడురోజుల పాటు నిర్వహించేలా బరుల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఫ్లడ్లైట్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఇక బరుల్లో భౌతిక దూరమనేది పూర్తిగా విస్మరించారు. కొన్ని పందేలు రూ.10 వేల నుంచి రూ.1.5 లక్షలకు పైగా జరిగాయి. పైపందేలు రెట్టింపు స్థాయిలో కాశారు. వేలం పాటలో బరులను దక్కించుకున్న కొందరు సొమ్ములు రాబట్టుకునేలా వర్షంలో సైతం పందేలు ఆగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోళ్లను రంగును బట్టి రూ.9 వేలు ఆపై ధరకు విక్రయించారు. బరుల సమీపంలోనే మాంసం పకోడి, ఇతర ఆహార పదార్థాల దుకాణాలను ఏర్పాటు చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి..
జిల్లాలోని కొన్ని బరుల్లో స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా కనిపించారు. రెండు రోజుల కిందటే జిల్లాకు చేరుకున్న జిల్లాయేతరులు పందేల వివరాలు తెలుసుకున్నారు. భోగి రోజున నచ్చిన చోటికి వాహనాల్లో తరలివెళ్లారు. బరుల్లో రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా చేతులు మారాయి.
ఏజెన్సీ, మెట్టలోని 15 మండలాల్లో సుమారు 50 పెద్ద బరులు, 70 చిన్న బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. బరుల వద్ద కోతాట, గుండాటలు యథేచ్ఛగా జరిగాయి. ప్రతిచోట రూ.లక్షల్లో చేతులు మారాయి. కుక్కునూరు మండలం శ్రీధరవేలేరు, జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం, కామయ్యపాలెం గ్రామాలకు తెలంగాణ నుంచి పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.
లోసరి బరి వద్ద గుమిగూడిన జనం
తేతువాదే పైచేయి
భీమవరం పట్టణం, న్యూస్టుడే: జిల్లాలోని బరుల్లో తేతువాదే (తెలుపురంగు పుంజు) పైచేయి అయ్యింది. పందేలు నిర్వహించరాదని అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహించింది. హెచ్చరికలు చేస్తూ.. జూదాల జోలికి వెళ్లొద్దంటూ సూచనలిస్తూ.. ఆటల పోటీలతో కోడి పందేలను నిలువరించే ప్రయత్నాలు చేసింది. భోగి రోజు ఉదయం వరకు తెర వెనుకే ఉన్న తేతువా శుక్రవారం ఉదయం బరి తెగించింది. బరుల్లోకి మరికొన్నింటిని వెంటబెట్టుకొని వెళ్లింది. ఎటుచూసినా కొక్కొరోకో అనిపించేలా కూతపెట్టించింది. కొన్నిచోట్ల తేతువాకు వ్యతిరేకంగా ఉన్న పుంజులను బరుల దరిదాపుల్లోకి రానీయకుండా అడ్డుకుంది. కొత్తరకం పుంజులను బరుల నిర్వాహకులుగా తెర మీదికి తీసుకొచ్చి సత్తా చాటుకుంది.
జోరుగా..
డింకీ పందేలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మంతెన, గోకరాజు
ఉండి, న్యూస్టుడే: కాళ్ల మండలం సీసలిలో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారింది. డబ్బు లెక్కించేందుకు బరి సమీపంలో కౌంటింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి పందెంరాయుళ్లు తరలివచ్చారు. తొలుత డింకీ పందేలను ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గోకరాజు రామరాజు ప్రారంభించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్రెడ్డి, నాయకులు విస్సాకోడేరులో పందేలను తిలకించారు.
ఉండ్రాజవరంలో గుండాట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!