స్వల్ప వివాదం.. పెను విషాదం
మద్యం మత్తులో వివాదానికి తెగబడి కత్తులతో దాడి చేసిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చాగల్లులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఎన్.ఫణికుమార్, స్టూడియో నిర్వహిస్తున్న మాచవరపు సురేష్ (29)
చాగల్లులో ముగ్గురిపై కత్తులతో దాడి
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
సురేష్ (పాత చిత్రం)
చాగల్లు, న్యూస్టుడే: మద్యం మత్తులో వివాదానికి తెగబడి కత్తులతో దాడి చేసిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చాగల్లులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఎన్.ఫణికుమార్, స్టూడియో నిర్వహిస్తున్న మాచవరపు సురేష్ (29), దుస్తుల వ్యాపారి వీర్ల రామకృష్ణలు బాల్య స్నేహితులు. ఈ నెల 13న ఫణికుమార్ ఛత్తీస్గఢ్ నుంచి స్వగ్రామం చాగల్లు వచ్చారు. శనివారం రాత్రి స్నేహితుడు రామకృష్ణకు చెందిన కారులో సినిమా చూసేందుకు ఈ ముగ్గురూ ధవళేేశ్వరం బయలు దేరారు. గ్రామ శివారు నందమూరు వంతెన సమీపంలో మద్యం తాగుతున్న కొందరు కారుకు అడ్డు పడి వీరితో తగాదాకు దిగారు. వారిలో ఒకరు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపారు. కారు వెళ్తుండగా తగాదా పడిన వ్యక్తుల్లో ఇద్దరు మోటారుసైకిల్పై వారిని దాటి అడ్డుగా నిలిచి ఫోన్ చేసి మరికొందరిని రప్పించారు. అందరూ కలిసి ముగ్గురిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఫణికుమార్ పక్కనే ఉన్న గోతిలో పడిపోగా సురేష్, రామకృష్ణలపై వారు కత్తితో దాడి చేశారు. ముగ్గురూ మృతి చెందారని భావించి దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత ఫణికుమార్ మేల్కొని తన స్నేహితులకు సమాచారం అందించారు. గాయాలపాలైన సురేష్, రామకృష్ణలను చాగల్లులో ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో సురేష్ మృతి చెందారు. రామకృష్ణను రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ బి.శ్రీనాథ్ పరిశీలించారు. ఫణికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిందితులుగా భావిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపడుతున్నామన్నారు. వారు స్థానికులు కాదని, ఇక్కడకు ఎందుకు వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నామన్నారు.
ఎదిగిన కొడుకు కానరాని లోకాలకు.. ఈ ఘటనలో మృతి చెందిన సురేష్కు ఇద్దరు అక్కలు. వారికి వివాహాలు అయ్యాయి. తండ్రి భాస్కర్కు సురేష్ చేదోడుగా ఉంటూ మూడేళ్ల నుంచి గ్రామంలో ఫొటోస్టూడియో నిర్వహిస్తున్నారు. అందివచ్చిన కొడుకు మరణవార్త విని సురేషన్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM