మళ్లీ చుట్టేస్తోంది
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జిల్లాలో బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈనెల 17న 46 కేసులు నమోదైతే 18న 245కు పెరిగాయి. తాజాగా బుధవారం అదే ఉద్ధృతి కొనసాగుతూ 216కు చేరాయి. హోమ్ ఐసొలేషన్లో
పెరుగుతున్న కొవిడ్ ఉద్ధృతి
పండగ అనంతరం మారిన పరిస్థితి
జిల్లాలో ఇప్పటి వరకు రోజుకు 1,000 నుంచి 1,500 కరోనా పరీక్షలు చేసేవారు. ఈ సంఖ్యను ఇక నుంచి 2,500కు పెంచారు. ట్రూనాట్, ర్యాపిడ్ టెస్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈనాడు డిజిటల్, ఏలూరు, ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జిల్లాలో బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈనెల 17న 46 కేసులు నమోదైతే 18న 245కు పెరిగాయి. తాజాగా బుధవారం అదే ఉద్ధృతి కొనసాగుతూ 216కు చేరాయి. హోమ్ ఐసొలేషన్లో ఉన్నవారిపై నిఘా లేకపోవటం, ప్రజలు నిబంధనలు విస్మరించి తిరగటం, సంక్రాంతి నేపథ్యంలో రాకపోకలు ఎక్కువ కావటం వంటి పరిణామాలు మహమ్మారి ఉద్ధృతికి కారణాలుగా చెబుతున్నారు. తణుకులో ఈనెల 18న ఆసుపత్రి వద్ద 80 మందికి కొవిడ్ పరీక్షలు చేస్తే 20 మందికి పాజిటివ్ వచ్చిందంటే కేసుల పెరుగుదలను అంచనా వేయొచ్ఛు
ఆలస్యంగా నివేదికలు.. కొవిడ్ పరీక్షల నివేదికలు 24 గంటల్లో రావాలని స్పష్టమైన ఆదేశాలున్నా కొన్ని చోట్ల అమలు కావటం లేదు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, చింతలపూడి, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో కరోనా పరీక్షల నివేదికలు రెండు రోజులకు వస్తున్నాయని చెబుతున్నారు. ఈలోగా కొందరు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు.. ఆకివీడు లో డిజిటల్ అసిస్టెంట్కు, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసు పత్రిలో వైద్యురాలు, ఇద్దరి సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయింది. బుధవారం మరో 14 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే జిల్లాలో మొత్తం 23 మంది ఉపాధ్యాయులకు, ముగ్గురు ఇతర సిబ్బందికి కరోనా సోకినట్లయింది.
ఇవీ కారణాలు.. జిల్లాలో కేసులు పెరగటానికి మొదట్నుంచీ సరైన పర్యవేక్షణ లేకపోవటమే కారణమని పలువురు చెబుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న బాధితులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వారు బయటకు వెళ్లకుండా కట్టడి చేసే పరిస్థితులు లేవు.
ఎక్కడ చూసినా జనమే.. గత నెలలో క్రిస్మస్, ఆ తరువాత కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో రాకపోకలు పెరిగాయి. వ్యాపార కూడళ్లల్లో రద్దీ పెరిగింది. సినిమా హాళ్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంటుల్లో వేరే చెప్పనక్కరలేదు. సంక్రాంతి పండగకు ఇతర ప్రాం తాల నుంచి బంధువులు రావటంతోపాటు విచ్చలవిడిగా సాగిన కోడిపందేలు, జూదాల్లో వివిధ వర్గాల ప్రజలు పాలుపంచుకోవటం కూడా వైరస్ వ్యాప్తికి కారణాలుగా చెప్పుకోవచ్ఛు
ఆసుపత్రుల్లో ప్రారంభమైన సేవలు..
జిల్లాలో తొలివిడతగా మొత్తం 55 ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో బుధవారం నుంచి సేవలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సేవలు కొనసాగుతుండగా కొత్తగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక పడకలను కేటాయించారు. ఇప్పటికే కొవిడ్ కేర్ సెంటర్లు కొనసాగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు కూడా రెండురోజుల్లో ప్రారంభించనున్నారు. మొత్తం 2 వేల పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.