logo

పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని ఆందోళన

ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక

Published : 20 Jan 2022 01:57 IST

ఏలూరులో జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉద్యోగులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక అగ్నిమాపక కూడలి వద్ద బుధవారం నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏను పాత స్లాబుల ప్రకారం ఇవ్వాలని, నగర భృతిని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ హరనాథ్‌, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్‌ రమేశ్‌కుమార్‌, ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నాగ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని