ఈ పీఆర్సీ మాకొద్దు
ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న ఈ పీఆర్సీ మాకొద్దంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశలవారీగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని
అంబేడ్కర్ విగ్రహాలకు ఐకాస వినతులు
ఏలూరు: అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న ఐకాస నాయకులు
ఏలూరు అర్బన్, భీమవరం పట్టం, న్యూస్టుడే: ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న ఈ పీఆర్సీ మాకొద్దంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశలవారీగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించగా ఐకాస జిల్లా నాయకులు ఏలూరు పాత బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఐకాస నాయకులు హరనాథ్, నారాయణ, విద్యాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐకాస ఆధ్వర్యంలో గురువారం నుంచి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జేబులు కత్తిరించేలా రివర్స్ పీఆర్సీని ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న చీకటి జీవోల విడుదలను నిరసిస్తున్నాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి. - వి.శోభన్, ఏపీఎన్జీవో భీమవరం తాలూకా కోశాధికారి
అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ను రద్దుచేస్తానని, ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు అధికారం కోసమో, రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఇప్పుడు తేటతెల్లమవుతుంది. - బి.గోపీమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
సీపీఎస్ విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం కాదు.. సీఎం ముందుకొచ్చి స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో సంఘటితంగా పోరాడతాం.- ఎల్.సాయిశ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు విలువలేని విధంగా ప్రభుత్వ తీరు ఉంది. ఇప్పటికైనా సరిచేసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. - ఎస్.కృష్ణమోహన్, మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగానే ముందుకెళ్తారని.. వినతులతో సరిపెడతారని భావించి తక్కువగా అంచనా వేస్తే ఇబ్బందికర పరిస్థితికి ప్రభుత్వం వెళ్లక తప్పదు. - వి.సత్యనారాయణమూర్తి, ఏపీఎన్జీవో భీమవరం తాలూకా అధ్యక్షుడు
భీమవరం: ప్రదర్శనలో పీఆర్సీ సాధన సమితి నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.